HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Aam Aadmi Party Shock Two Councillors Joined Bjp

BJP : ఆమ్ ఆద్మీ పార్టీ షాక్‌..బీజేపీలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు

BJP : దిల్షాద్ కాలనీ నంబర్ 217 వార్డుకు ప్రీతి కౌన్సిలర్‌గా ఉండగా, గ్రీన్‌పార్క్ వార్డ్ నెంబర్ 150కి కౌన్సిలర్‌గా ఫోగట్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీలో చేరారు.

  • By Latha Suma Published Date - 06:56 PM, Wed - 25 September 24
  • daily-hunt
Aam Aadmi Party shock..Two councillors joined BJP
Aam Aadmi Party shock..Two councillors joined BJP

Aam Aadmi Party: ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ప్రీతి, సరిత ఫోగట్‌లు బుధవారం ఉదయం బీజేపీలో చేరారు. దిల్షాద్ కాలనీ నంబర్ 217 వార్డుకు ప్రీతి కౌన్సిలర్‌గా ఉండగా, గ్రీన్‌పార్క్ వార్డ్ నెంబర్ 150కి కౌన్సిలర్‌గా ఫోగట్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీలో చేరారు. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ సచ్‌దేవ, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఎంసీడీ సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశంలో ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకుంటారు. కమల్‌జీత్ షరావత్ ఇటీవల ఎంపీగా ఎన్నికకావడంతో స్టాండింగ్ కమిటీ సభ్యుడి సీటుకు ఖాళీ ఏర్పడింది. ఎంసీడీ సమావేశంలో ఈ ఎన్నిక జరుగనుంది.

Read Also:Jammu Kashmir Elections: జమ్మూకు రాష్ట్ర హోదాపై రాహుల్ గాంధీ కీలక ప్రకటన

కాగా, పార్టీలో ఉండలేకే ఆప్‌ను వీడినట్టు ప్రీతి తెలిపారు. తాను నాలుగుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యానని, ప్రజల్లోనే ఉంటూ మున్సిపల్ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. వైవిధ్యం అశించి ఆప్‌లో చేరినప్పటికీ ఇప్పుడు విభిన్నమైన వాతావరణం ఉందని, ఆ వాతావరణంలో ఇమడకలేకనే పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. డ్రైనేజీ సమస్యలు, మురికి జలాల సరఫరా వంటి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి అతిషి కానీ, తన ప్రాంతంలోని స్థానిక ఎమ్మెల్యేగానీ ఎవరూ ఆసక్తి చూపండం లేదన్నారు. కాగా, తమ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు బీజేపీలో చేరడంలో ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే స్పందించలేదు. ఎంసీడీలో ప్రస్తుతం ఆప్‌కు 122 మంది కౌన్సిలర్లు ఉండగా, బీజేపీకి 117 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2022 డిసెంబర్ ఎన్నికల్లో బీజేపీ 15 ఏళ్ల పాలనకు ఆప్ గండికొట్టింది. మొత్తం 250 ఎంసీడీ వార్డుల్లో 134 వార్డులను ఆప్ కైవసం చేసుకుంది. బీజేపీ 104 వార్డులకే పరిమితమైంది. అయితే ఆ తర్వాత పలువురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరుతూ వచ్చారు.

Read Also:Hydra: ‘హైడ్రా’ కారణంగా ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదు: మల్లారెడ్డి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aam aadmi party
  • bjp
  • Councillors
  • Councilor Preeti
  • Councilor Sarita
  • delhi

Related News

Bjp Ramachandra

CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

CM Revanth : ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd