Borewell : బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- By Latha Suma Published Date - 11:04 AM, Sat - 13 April 24
Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రేవా జిల్లా(Rewa District)లో ఆరేండ్ల బాలుడు(6 year old boy) బోరు బావిBorewell)లో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రేవా జిల్లా మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు ఓపెన్ బోర్వెల్ దగ్గర ఆడుకుంటుండగా హఠాత్తుగా దాంట్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావి 70 అడుగుల లోతు ఉన్నదని, నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిస్తున్నామని చెప్పారు.
#WATCH | Bhopal: Madhya Pradesh CM Mohan Yadav says, "…It's saddening. Teams are there to rescue and the administration will do everything to save the child. MLA Siddharth Tiwari is there at the site, I hope we succeed in it…" https://t.co/kw9zjxrt4v pic.twitter.com/6rK1QFV0uf
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 13, 2024
We’re now on WhatsApp. Click to Join.
బాలుడు ప్రస్తుతం 6 సెంటీమీటర్ల లోతులో ఉన్నాడని అదనపు ఎస్పీ అనిల్ సోంకర్ తెలిపారు. పైపు ద్వారా ఆక్సిజన్ లోపలికి సరఫరా చేస్తున్నామన్నారు. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాను కూడా పంపించామని చెప్పారు. అయితే కొన్ని అడ్డంకుల వల్ల అది బాలుడిని చేరుకోలేకపోయిందని వెల్లడించారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నామన్నారు. వారణాసి నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాన్ని రప్పించామని.. త్వరగానే బాలుడిని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు.
Read Also: BRS Chevella Sabha : విజయమే లక్ష్యంగా ఈరోజు చేవెళ్ల లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
Related News
Train Derailed: దేశంలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్
మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నుండి మంగళవారం ఉదయం ఖాండ్వా జంక్షన్లో గూడ్స్ రైలు 5 కోచ్లు పట్టాలు తప్పాయి.