Ice Cream: ఐస్క్రీమ్ తిని అస్వస్థత.. వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన 55 మందికి చికిత్స
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖర్గోన్ జిల్లాలో ఓ మతపరమైన కార్యక్రమంలో ఐస్క్రీమ్ (Ice Cream) తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్తో 55 మంది అస్వస్థతకు గురయ్యారు.
- Author : Gopi
Date : 07-04-2023 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖర్గోన్ జిల్లాలో ఓ మతపరమైన కార్యక్రమంలో ఐస్క్రీమ్ (Ice Cream) తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్తో 55 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన వారిలో 25 మంది చిన్నారులు ఉన్నారని, ఐస్క్రీం నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోని ఛతల్ గ్రామంలోని ఒక ఆలయంలో మతపరమైన వేడుక సందర్భంగా బుధవారం రాత్రి దినేష్ కుష్వాహా విక్రయించిన ఐస్క్రీమ్ను వీరు తిన్నారని ఖర్గోన్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దౌలత్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఫుడ్ పాయిజన్ కావడంతో కడుపునొప్పి, వాంతులు, కడుపునొప్పితో 25 మంది చిన్నారులు సహా 55 మందిని జిల్లా ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది చిన్నారులు, మరో 10 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలీప్ సెప్టా తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: Covid 19: పెరుగుతున్న కరోనా వేగంపై కేంద్రం అప్రమత్తం, నేడు కేంద్ర ఆరోగ్య మంత్రి ఉన్నత స్థాయి సమావేశం
ఇదిలా ఉండగా మతపరమైన కార్యక్రమాల్లో ఏదైనా తిన్న తర్వాత అస్వస్థతకు గురైన అనేక కేసులు ఇటీవల నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో జరిగిన ఒక పండుగ సందర్భంగా ప్రసాదంలో సాగో ఖిచ్డీ తిని మొత్తం 65 మంది అస్వస్థతకు గురయ్యారు. గత ఏడాది ఆగస్టులో అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ప్రసాదం సేవించి పలువురు చిన్నారులతో సహా కనీసం 70 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని నారాయణపూర్ సమీపంలోని పన్బారి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్బరి గ్రామంలోని చాలా మంది ప్రజలు ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రసాదం తిన్న వెంటనే వారిలో చాలా మందికి కడుపునొప్పి, వాంతులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.