Gang Raped: ఢిల్లీలో దారుణమైన ఘటన.. మూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఢిల్లీలో మూడేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి (Gang Raped) పాల్పడ్డారు. అడవిలో అపస్మారక స్థితిలో ఓ బాలిక కనిపించింది. వెంటనే ఆమెను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు.
- By Gopichand Published Date - 08:15 AM, Sat - 4 February 23
ఢిల్లీలో మూడేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి (Gang Raped) పాల్పడ్డారు. అడవిలో అపస్మారక స్థితిలో ఓ బాలిక కనిపించింది. వెంటనే ఆమెను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలికకు చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో కేసు దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికపై క్రూరంగా ప్రవర్తించిన ఘటన శుక్రవారం (ఫిబ్రవరి 3) ఉదయం జరిగింది. నివేదికల ప్రకారం.. ఈ విషయం దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బెరీ ప్రాంతానికి సంబంధించినది. ఉదయం బాలిక ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో నిందితులు ఆమెను తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇంట్లో బాలిక కనిపించకపోవడంతో బాలిక కోసం వెతకడం ప్రారంభించామని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. చుట్టుపక్కల నివసించే ఒక మహిళ, తాను ఆ ప్రాంతానికి సమీపంలోని అడవిలో బాలికను చూశానని చెప్పింది. ఇద్దరు పురుషులు అడవి వైపు వెళ్లడం కూడా తాను చూశానని ఆ మహిళ చెప్పింది. మహిళ నుంచి సమాచారం అందుకున్న వెంటనే అడవిలో వెతకగా బాలిక ఏడుస్తూ కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక రక్తపు మడుగులో ఉందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే బాలికను ఎయిమ్స్లో చేర్చగా, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Also Read: Navi Mumbai: నవీ ముంబైలోని డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను 27 ఏళ్ల రామ్నివాస్ పనికా, 22 ఏళ్ల శక్తిమాన్ సింగ్గా గుర్తించారు. నిందితులిద్దరూ వివాహితులై వ్యర్థాల రీసైక్లింగ్ కంపెనీలో సహాయకులుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు బాలిక పరిస్థితి చూసి ఆమె తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Related News
Arvind Kejriwal: నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు
న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested) తర్వాత ఢిల్లీ అసెంబ్లీ (assembly-session)నేడు తొలిసారి సమావేశం కానుంది. జైలు నుంచే పరిపాలిస్తానన్న కేజ్రీవాల్ అన్నట్టే నిన్న జైలు నుంచే రెండో ఆదేశం జారీచేశారు. సర్కారు సారథ్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్లలో ఉచిత మందులు, రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆరో�