Heavy Rainfall: ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం : 15 మంది మృతి
ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వరదలు పడుతుండటంతో రవాణా స్తంభించింది.
- By Praveen Aluthuru Published Date - 09:38 PM, Sun - 9 July 23
Heavy Rainfall: ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వరదలు పడుతుండటంతో రవాణా స్తంభించింది. కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగి పడటంతో మరణాలు చోటుచేసుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఆదివారం పదికి పైగా మరణించినట్లు నివేదించింది.
#WATCH | Portion of National Highway 3 washed away by overflowing Beas river in Kullu, Himachal Pradesh pic.twitter.com/c8gRsvSkt5
— ANI (@ANI) July 9, 2023
భారీ వరదలు న్యూ ఢిల్లీ మరియు గురుగ్రామ్లో విధ్వంసం సృష్టించింది. స్థానికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. వరదల కారణంగా 17 రైళ్లను రద్దు చేయగా, మరో 12 రైళ్లను ఉత్తర రైల్వే దారి మళ్లించింది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షం పడగా, చండీగఢ్ మరియు హర్యానాలోని అంబాలాలో వరుసగా 322.2 మిమీ మరియు 224.1 మిమీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ నుండి విధ్వంసక కొండచరియల వీడియోలు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వెలువడ్డాయి. రెడ్ అలర్ట్ ప్రకటించగా ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. సిమ్లాలోని కోట్ఘర్ ప్రాంతంలో ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. కులు మరియు చంబా జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పద్నాలుగు పెద్ద కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్లో సుమారు 7000 రోడ్లు మూసివేయబడ్డాయి.
Nursery Bridge collapsed at Sissu
9th July 2023
Lahaul , Himachal Pradesh pic.twitter.com/u1CTQSpFbN— Weatherman Shubham (@shubhamtorres09) July 9, 2023
ఉత్తరాఖండ్లో, రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గులార్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో జీప్ నదిలో పడిపోవడంతో ముగ్గురు యాత్రికులు వరదల్లో కొట్టుకుపోయారు. జీపులో 11 మంది ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఐదుగురిని రక్షించామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసినట్లు అధికారులు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Read More: Maun Satyagraha: జూలై 12న కాంగ్రెస్ ‘మౌన్ సత్యాగ్రహం’
Related News
Afghanistan Floods : ఆఫ్ఘనిస్తాన్లో పోటెత్తిన వరదలు.. 60 మంది మృతి
Afghanistan Floods : అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ను భూకంపాలు, వరదలు వణికిస్తున్నాయి.