అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే
- Author : Vamsi Chowdary Korata
Date : 18-12-2025 - 2:58 IST
Published By : Hashtagu Telugu Desk
Bananas : అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అన్నీ సీజన్లలో లభించే ఈ పండ్లని ప్రతీ ఒక్కరూ కూడా ఇష్టంగా తింటారు. తక్కువ ధరలోనే దొరికే ఈ పండ్లకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అవును మరి ఒకటి రెండు తినగానే కడుపు నిండుతుంది. ఇందులో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. అందుకే, పండ్లుగానే గుర్తొచ్చే పేర్లలో అరటిపండ్లు కూడా ముందువరసలోనే ఉంటాయి. అయితే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొంతమంది ఈ పండ్లని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అదెవరంటే
అరటిపండ్లలో కేలరీలు, కార్బ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్, ముఖ్యమైన పోషకాలు, మినరల్స్ హై పొటాషియం, విటమిన్ బి6లు ఉంటాయి. విటమిన్ సి, మెగ్నీషియంలు కూడా ఉంటాయి. ఇందులో నేచురల్ షుగర్ ఉంటాయి. అవే ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్లు ఉంటాయి. ఇవి ఎనర్జీని అందిస్తాయి. అంతేకాకుండా, గట్ హెల్త్ని కాపాడతాయి. ఇవి ఈజీగా జీర్ణమవుతాయి. చాలా హెల్దీ అయిన స్నాక్ అని చెప్పొచ్చు. వీటిని తినడం వల్ల ఇన్స్టంట్గా మనకి ఎనర్జీ అందుతుంది. పైగా వీటికి సీజన్తో పనిలేదు. ఏ సీజన్ అయినా ఎంతలా ధరలు పెరిగినా ఇవి మిగతా పండ్లతో పోలిస్తే అందరికీ అందుబాటులోనే ఉంటాయి. అందుకే, అందరూ వీటిని ఇష్టపడతారు.
కొందరు మాత్రం తినొద్దు
ఎన్నో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే అరటిపండ్లని కొంతమంది తినకపోవడమే మంచిదని సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ నాగార్జున చెబుతున్నారు. అందరికీ మేలు చేసే ఈ పండ్లు కొంతమందికి మాత్రం నెగెటీవ్ ఎఫెక్ట్స్ని చూపిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా మూడు సమస్యలు ఉన్నవారు అరటిపండ్లని అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు. వారు ఎవరంటే
మైగ్రేన్ ఉన్నవారికి వద్దు
మైగ్రేన్ ఉన్నవారు అరటిపండ్లని కచ్చితంగా అవాయిడ్ చేయాలని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ నాగార్జున. ఎందుకంటే అరటిపండ్లలో థైరామిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది బాడీలోకి చేరాక తలనొప్పి మరింత పెరుగుతుంది. మైగ్రేన్ ఉన్నవారు అరటిపండ్లని తిన్నప్పుడు తలనొప్పి పెరుగుతుందని నాగార్జున చెబుతున్నారు. అందుకే, కచ్చితంగా అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు.
షుగర్ ఉన్నవారికి వద్దు
షుగర్ ఉన్నవారు పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, కొన్ని పండ్లలని పంచదార శాతం షుగర్ లెవల్స్ని అమాంతం పెంచేస్తాయి. బాగా పండిన అరటిపండ్లలో గ్లైసెమిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ పండ్లని తిన్నప్పుడు షుగర్ లెవల్స్ పెరుగుతాయి. స్వీట్స్ తిన్నప్పుడు షుగర్ లెవల్స్ ఎలా అయితే పెరుగుతాయో బాగా పండిన అరటిపండ్లు తిన్నా కూడా అదే విధంగా, షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి, కచ్చితంగా షుగర్ ఉన్నవారు ఈ పండ్లని అవాయిడ్ చేయడం మంచిది.
కిడ్నీ సమస్యలున్నవారు కూడా తినొద్దు
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా అరటిపండ్లకి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు న్యూట్రిషనిన్ట్ నాగార్జున. ఎందుకంటే, అరటిపండ్లలో పొటాషియం లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పొటాషియంని కిడ్నీలు ఫిల్టర్ చేయలేకపోతే అది బాడీలోని పెరిగిపోయి అస్సలు మంచివి కాదు. కాబట్టి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా అరటిపండ్లని అవాయిడ్ చేయాలి.
ఇక మిగతా వారు
ఇక మిగిలిన వారు అరటిపండ్లని తినొచ్చు. కానీ, మోతాదులోనే తినడం మంచిది. మంచివి కదా, అందుబాటులో ఉన్నాయి కదా అని ఎక్కువగా తింటే సమస్యలు వస్తాయి. ఏ పండు అయినా, ఆహారమైన సరైన మోతాదులో తిన్నప్పుడే అవి ఔషధంలా పనిచేస్తాయి. లేదంటే బాడీలోకి చేరి లేనిపోని సమస్యల్ని తీసుకొస్తాయి.