Drinking Water: ఆహారానికి ముందు నీరు తాగడం మంచిదేనా?
నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఇందులో సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. మన కడుపులో ఇప్పటికే కొన్ని ఆమ్లాలు ఉంటాయి.
- By Gopichand Published Date - 05:53 PM, Sat - 3 May 25

Drinking Water: ఆరోగ్య నిపుణులు అందరూ శరీరానికి సరిపడా నీరు (Drinking Water) తాగమని సలహా ఇస్తారు. ఆహారం, నీరు రెండూ అవసరమైనవే అయినప్పటికీ నీటి ప్రాముఖ్యత చాలా విభిన్నంగా ఉంటుంది. వేసవి కాలంలో నీటి మోతాదును మరింత పెంచాలి. ఎందుకంటే ఇది శరీరంలో హైడ్రేషన్ కొరతను నివారిస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్య అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటిలో హీట్ స్ట్రోక్, జీర్ణ సమస్యలు ఉన్నాయి.
జీర్ణ వ్యవస్థను సరిగ్గా ఉంచడానికి నీరు తాగడం చాలా ముఖ్యం. కానీ తప్పుడు రీతిలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా దెబ్బతినవచ్చు. తరచుగా నీరు తాగడంలో తప్పులు ఆహారం తినే సమయంలో జరుగుతాయి. ఆచార్య బాలకృష్ణ రాసిన పతంజలి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ పుస్తకంలో.. ఆహారం తినే ముందు, తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ రసాలు (లిక్విడ్) ప్రభావితమవుతాయని తెలిపారు.
నీరు జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
పుస్తకంలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఇందులో సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. మన కడుపులో ఇప్పటికే కొన్ని ఆమ్లాలు ఉంటాయి. ఆహారం, నీరు ఈ ఆమ్లాలతో కలవడం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేయడం లేదా మెరుగుపరచడం జరుగుతుంది.
Also Read: MS Dhoni: ఆర్సీబీపై రికార్డు సృష్టించేందుకు సిక్సర్ దూరంలో ఉన్న కెప్టెన్ కూల్!
ఆహారానికి ముందు నీరు తాగడం
నిపుణుల ప్రకారం.. ఆహారం తినడానికి 10-15 నిమిషాల ముందు నీరు తాగడం ప్రయోజనకరం. దీని వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా మారుతుంది. ఆహారానికి ముందు నీరు తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. మీరు అతిగా తినడం నుంచి తప్పించుకోవచ్చు. దీని వల్ల మీకు తరచూ ఆహారం కావాలనే కోరికలు కలగవు. ఆహారానికి ముందు నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ రసాలు విడుదలవుతాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.
ఆహారం తర్వాత నీరు తాగడం
ఆహారం తిన్న దాదాపు 30 నిమిషాల తర్వాత నీరు తాగడం ప్రయోజనకరంగా భావిస్తారు. ఎందుకంటే ఈ వ్యవధిలో ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఒకవేళ ఎవరైనా వెంటనే నీరు తాగితే ఆహారంతో పాటు కడుపులో ద్రవాలు కూడా పెరుగుతాయి. ద్రవాలు పెరగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తినే సమయంలో మధ్యలో కొద్దిగా నీరు తాగవచ్చు. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇతర చిట్కాలు
- ఉదయం మొదటగా, రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా గోరువెచ్చని నీరు తాగండి. ఆయుర్వేదంలో ఇది ఆరోగ్యకరమైన అలవాటుగా భావిస్తారు.
- ఆహారం తిన్న తర్వాత కొంత సేపు నడవండి. ఆ తర్వాత నీరు తాగండి.
- రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తాగండి.
- నిలబడి నీరు తాగే అలవాటును మార్చుకోండి.
- డీహైడ్రేషన్ సంకేతాలను అర్థం చేసుకోండి. వీటిలో మూత్రం గాఢ రంగులో ఉండటం, వాసన రావడం, చర్మం పొడిగా మారడం వంటివి ఉంటాయి.
- వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు తగినంత నీరు తాగాలి.