Health: రాత్రి భోజనంలో ఈ ఆహారాలను తీసుకోవద్దని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.!!
భారతదేశంలో ఆయుర్వేదం శాస్త్రం చాలా పురాతనమైంది. ఇది ప్రపంచంలోపి పురాతన ఔషద వ్యవస్థలో ఒకటిగా పేరొందింది.
- By hashtagu Published Date - 03:04 PM, Fri - 14 October 22
భారతదేశంలో ఆయుర్వేదం శాస్త్రం చాలా పురాతనమైంది. ఇది ప్రపంచంలోపి పురాతన ఔషద వ్యవస్థలో ఒకటిగా పేరొందింది. ఆయుర్వేదం అంటే జీవితానికి సంబంధించినది. ఇది శరీరానికి సరైన మార్గంలో చికిత్స చేయడానికి శతాబ్దాలుగా మార్గనిర్దేశం చేస్తోంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత మనం ఏం తినకూడదు. రాత్రి పూట ఆలస్యంగా తినడం వల్ల వ్యక్తి వాత అసమతుల్యత చెందుతుంది. అంటే కొంతకాలం తర్వాత వ్యక్తి జీర్ణవ్యవస్థ బలహీనపడుతుది. అందుకే మన జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే రాత్రిపూట ఈ ఐదు ఆహారాలు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం.
1. పెరుగు
రాత్రిపూట పెరుగు తినకూడదని మీరు వినే ఉంటారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల మీ శరీరంలో కఫా, పిత్త దోషాలు పెరుగుతాయి. ఇది జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, వికారం, మలబద్ధకానికి కూడా దారితీస్తుంది. పెరుగుకు బదులు మజ్జిగ తాగితే మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
2. రా సలాడ్
చాలా మంది తమ ఆహారంలో సలాడ్ను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రాత్రిపూట దీన్ని తినడం మానేయాలి. ఎందుకంటే సలాడ్ చల్లగా, పొడిగా ఉంటుంది. వ్యక్తిలో వాత దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, నీటి కొరత, విశ్రాంతి లేకపోవడం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. రాత్రి భోజనం తర్వాత మనం బాగా నిద్రపోవాలి. కానీ సలాడ్ మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనివ్వదు. ఆయుర్వేదం ప్రకారం, సలాడ్ను తేలికగా ఉడికించి తినడం మంచిది.
3. పిండి
మైదా పిండి జీర్ణం కావడం చాలా కష్టం. భటుర్, నాన్ మొదలైన అనేక భారతీయ వంటకాలు కూడా దీనితో తయారు చేస్తారు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ దీనివల్ల ఎదురయ్యే సమస్యలు చాలామందికి తెలియవు. ఇది జీవక్రియను క్రమంగా పాడుచేస్తుంది.
4. గోధుమ పిండి
రాత్రి భోజనంలో గోధుమలతో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే గోధుమలు కడుపుకి చాలా బరువుగా ఉంటుంది. అది జీర్ణం అవ్వాలంటే సమయం పడుతుంది. మీరు రాత్రిపూట గోధుమ పిండితో చేసిన ఏదైనా తింటే, అది శరీరంలో విషాన్ని సృష్టిస్తుంది, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
5. ఉప్పు
రాత్రి 7 తర్వాత ఉప్పు కూడా తినకూడదు. ఉప్పు శరీరంలో నీటి నిల్వను పెంచుతుంది. సాయంత్రం 7 గంటల తర్వాత ఉప్పు తినడం వల్ల మన గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
Related News
Sugar Patients: షుగర్ పేషెంట్లకు ఏ రైస్ మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారు..!
సాధారణంగా మధుమేహం ఉన్నవారు అన్నం తినకుండా ఆరోగ్య నిపుణులు నిషేధిస్తారు.