HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Fact Check
  • >Fact Check 2015 Building Collapse Photo Falsely Shared In Name Of Feb 17 Earthquake In Delhi Ncr Region

Fact Check: ఢిల్లీలో భూకంపంతో కూలిన భవనాలు.. ఫొటోలు వైరల్

PTI ఫ్యాక్ట్ చెక్ డెస్క్(Fact Check) ఈ ఫొటో గురించి దర్యాప్తు చేసింది.

  • By Pasha Published Date - 08:24 PM, Tue - 18 February 25
  • daily-hunt
Fact Check 2015 Building Collapse 2025 Delhi Earthquake Shakti Collective Ptinews

Fact Checked By ptinews

ప్రచారం : ఢిల్లీ ఎన్‌‌సీఆర్‌ ప్రాంతంలో ఇటీవలే(2025 ఫిబ్రవరి 17న) సంభవించిన భూకంపంలో ఒక భవనం పాక్షికంగా కూలిపోయింది.

వాస్తవం : వైరల్ అయిన ఈ ఫోటో 2015 అక్టోబరు నాటిది. అప్పట్లో సంభవించిన భూకంపం వల్ల  దెబ్బతిన్న భవనం ఫొటో ఇది.

సోమవారం రోజు (ఫిబ్రవరి 17న) తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌‌సీఆర్‌ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఒక భవనం పాక్షికంగా కూలిపోయిందంటూ  ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. PTI ఫ్యాక్ట్ చెక్ డెస్క్(Fact Check) ఈ ఫొటో గురించి దర్యాప్తు చేసింది. చివరకు.. ఈ  వైరల్ ఫోటో 2015 అక్టోబరు నాటిదని తేలింది. అప్పట్లో ఢిల్లీలో భూకంపం రావడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో నుంచి ఒక ఇంటి ఫొటోను తీసుకొని..  తాజాగా 2025 ఫిబ్రవరి 17న చోటుచేసుకున్న భూకంపంలో దెబ్బతిన్న ఇల్లు ఇదే అంటూ తప్పుగా ప్రచారం చేశారని తేలింది.వాస్తవానికి ఆ ఫొటోకు, ఫిబ్రవరి 17న వచ్చిన ఢిల్లీ భూకంపానికి సంబంధం లేదని వెల్లడైంది.

Also Read :Sudan War : 3 రోజుల్లో 200 మంది మృతి.. సూడాన్‌లో రక్తపాతం

తప్పుడు ప్రచారం 

ఫిబ్రవరి 17న థ్రెడ్ యూజర్ ఒక పోస్ట్ పెట్టాడు.  ‘‘తాజాగా ఢిల్లీ భూకంపంలో పాక్షికంగా దెబ్బతిన భవనం ఇది’’ అంటూ ఒక ఫొటోను షేర్ చేశాడు. ‘‘ఢిల్లీ-ఎన్‌‌సీఆర్‌ ప్రాంతంలో భూకంపం. ఢిల్లీ-ఎన్‌‌సీఆర్ అంతటా ఫిబ్రవరి 17న ఉదయం 5:30 గంటలకు, ఆపై బిహార్‌లో ఉదయం 8 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది’’ అని ఈ పోస్ట్‌లో సదరు వ్యక్తి రాశాడు. పోస్ట్ కి సంబంధించిన లింక్, ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉన్నాయి.

వాస్తవ తనిఖీ

ఈ ఫొటోను తొలుత గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా తనిఖీ చేశారు. దీంతో చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇదే ఫొటోతో  ఢిల్లీ భూకంపంపై పెద్దసంఖ్యలో పోస్ట్‌‌లు పెట్టారని వెల్లడైంది. ఆ పోస్ట్‌లలో ఒకదానికి సంబంధించిన  లింక్,  ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది. సెర్చ్ ఫలితాలను మరింత స్కాన్ చేయగా.. 2024లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటిదే  ఒక ఫోటోను షేర్  చేశారని గుర్తించారు. ఆ పోస్ట్  లింక్ ఇక్కడ ఉంది. 

Also Read :Division Of Husband : మొదటి భార్య, రెండో భార్య.. ఓ భర్త సంచలన నిర్ణయం

ఈ ఫొటోకు సంబంధించిన మీడియా నివేదికల కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేశారు. దీంతో 2015 నవంబర్ 9న హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక న్యూస్ రిపోర్ట్ కనిపించింది. “భూకంపంతో  భవనం కూలిపోవడం, దక్షిణ ఢిల్లీలో భయాన్ని రేకెత్తిస్తోంది” అని ఆ వార్తకు శీర్షిక పెట్టారు.  “సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని అనధికార కాలనీలో నాలుగు అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న భవనాలపై కూడా డొమినో ప్రభావం ఉంటుందనే భయాన్ని రేకెత్తిస్తోంది” అని ఆ నివేదికలో వివరించారు. దాని లింక్ ఇక్కడ ఉంది.

ఈ వార్తలో కవర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలాగే ఉందని డెస్క్ గుర్తించింది. 2015లో ఢిల్లీలో భూకంపం వచ్చినప్పుడు ప్రభావితమైన భవనం ఫొటోతోనే తప్పుడు  ప్రచారం చేశారని తేల్చింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘ptinews’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2015 Building Collapse
  • 2025 Earthquake
  • delhi
  • Delhi Earthquake
  • Fact Check
  • False News
  • ptinews
  • Shakti Collective

Related News

India Cricket Team

PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నట్లు సమాచారం. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు.

  • Rename Delhi

    Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాల‌ని అమిత్ షాకు లేఖ!

  • Delhi Pollution

    Delhi Pollution : ఢిల్లీ ప్రజలను భయపడుతున్న వాయు కాలుష్యం

Latest News

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

  • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

  • Telangana New Cabinet : కొండా అవుట్..విజయశాంతి ఇన్ ..?

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd