Bathukamma 2024: నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం.. చేయాల్సిన 9 నైవేద్యాలు ఇవే..!
బతుకమ్మ 9 రోజులపాటు తీరక్క పూలతో బతుకమ్మని ఇంటింటా పేర్చుకోవడంతో పాటుగా ప్రతి రోజు రోజుకొక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు.
- By Gopichand Published Date - 11:29 AM, Wed - 2 October 24

Bathukamma 2024: తెలంగాణలో పువ్వులని పూజించే సంప్రదాయ పండుగ బతుకమ్మ. నేటినుండి బతుకమ్మ (Bathukamma 2024) సంబరాలు ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ పండుగ అంటే ఊరురా వాడవాడలా సందడిగా మారుతుంది. తీరోక్క పువ్వులతో గౌరమ్మని పూజిస్తారు. బతుకమ్మ అటపాటలతో పండుగ వాతావరణం ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ నుండి మొదలుకొని చివరిరోజు సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకొని పూలపండుగ జరుపుకుంటారు.
బతుకమ్మకు 9 నైవేద్యాలు
బతుకమ్మ 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం.
బతుకమ్మ 9 రోజులపాటు తీరక్క పూలతో బతుకమ్మని ఇంటింటా పేర్చుకోవడంతో పాటుగా ప్రతి రోజు రోజుకొక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. కానీ చివరి రోజు అయినా సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారుచేస్తారు.
Also Read: Flood Relief Funds: వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతంటే..?
ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి.
ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి.
నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.
అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి.
అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. ఈనాడు నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి.
వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి.
సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.
తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. గానాబజానాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూలతో తయారు చేసిన బతుకమ్మ శిరస్సుపై కొలువుంచిన పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మాంగళ్యానికి అంటే పుస్తెకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు మాలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.