Acharya: ఆచార్య’ ప్రీ రిలీజ్ కు చీఫ్ గెస్ట్ గా ‘పవన్ కళ్యాణ్’..?
- By hashtagu Published Date - 02:18 PM, Sun - 10 April 22
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా జోరు పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలోనే ఏప్రిల్ 24న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
ఇకపోతే సహజంగానే మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు… మెగా అభిమానుల జోష్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మరోవైపు ఒకే ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోటే కలిస్తే.. ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ఇప్పుడు అదే జరగబోతుందని సమాచారం. అదేనండి… ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇదే గనుక నిజమైతే… ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానులు చూడొచ్చు. మరో విషయం ఏంటంటే… పవన్ తో పాటు చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా వస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే… ‘ఆచార్య’ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి.
Related News
Pithapuram : బులుగు మీడియా బద్దలే..!
మొన్నటికి మొన్న, సాక్షి, బ్లూ మీడియాలోని ఒక విభాగం డిసెంబర్లో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్లో జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వస్తున్నట్లు ఒక నివేదికను ప్రచురించింది.