Gopichand: సినిమా ఫలితాలపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి.. హీరో గోపీచంద్ వైరల్ కామెంట్స్?
డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం రామబాణం. ఇప్పటికే వీరిద్దరికి కాంబినేషన్లో గతంలో లౌక్యం, లౌక్యం వంటి సినిమాలు వ
- By Nakshatra Published Date - 07:50 PM, Thu - 4 May 23
డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం రామబాణం. ఇప్పటికే వీరిద్దరికి కాంబినేషన్లో గతంలో లౌక్యం, లౌక్యం వంటి సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా నటించిన రామబాణం సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. అలాగే ఇందులో జగపతిబాబు కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 5న తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్యం సినిమాకి రామబాణం సినిమాకి ఎటువంటి సంబంధం లేదు రెండు వేరు వేరు కథలు అని తెలిపాడు గోపీచంద్. సినిమా టైటిల్ ని బాలకృష్ణ గారు పెట్టారు. అనుకోకుండా ఆయన షో కి వెళ్ళినప్పుడు ఆయన ఆ టైటిల్ చెప్పడంతో అదే బాగుంది అని దానిని కన్ఫామ్ చేశాము అని చెప్పుకొచ్చారు గోపీచంద్. ఇందులో ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు నటించారు. అతన్ని కలిస్తే సొంత అన్నయ్యని కలిసినట్టే ఉంటుంది. అందుకే మా మధ్య సన్నివేశాలు అంత బాగా పండాయి అని చెప్పుకొచ్చారు గోపీచంద్. ప్రెస్ మీట్ లో రీపోర్టర్ ప్రశ్నిస్తూ.. జగపతిబాబు ఇప్పుడు ఇలాంటి ఒత్తిడి లేకుండా నటిస్తున్నాను అని చెప్పారు.
మరి మీకు అలాంటి ఒత్తిడి ఏమైనా ఉందా అని అడగగా.. ప్రతి హీరోకి ఒత్తిడి ఉంటుంది. ఈ సినిమా విషయంలో జగపతిబాబు గారికి కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే సినిమా ఫలితం మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి విజయవంతమైన సినిమా అందించాలని ఒత్తిడి అందరిలోనూ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు గోపీచంద్. కదాకాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని గోపీచంద్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు..
Related News
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి రిస్క్ చేయబోతున్నాడా.. ఎందుకంటే
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో హిట్లు, ఫెయిల్యూర్స్ రుచి చూశారు. ఛత్రపతి ఫ్లాప్ కావడంతో ఆయన బాలీవుడ్ ప్లాన్స్ ప్రస్తుతానికి ఆగిపోయాయి. చిన్న విరామం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండేళ్ల పాటు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కౌశిక్ దర్శకత్వంలో కిష్కిందపురి