Prabhas : హీరో ప్రభాస్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..!!
ఆదిపురుష్ మూవీ యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది.
- By hashtagu Published Date - 04:28 PM, Mon - 10 October 22
ఆదిపురుష్ మూవీ యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఓ వర్గంవారి మనోభాలు గాయపర్చారని దాఖలైన పిల్ పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూవీ యూనిట్ తోపాటు హీరో ప్రభాస్ కు కూడా నోటీసులు జారీ చేశారు.
ఆదిపురుష్ టీజర్ ను చిత్ర యూనిట్ ఈమధ్యే రిలీజ్ చేసింది. ఈ టీచర్ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. చిత్ర యూనిట్ పై ట్రోల్స్ చేశారు. దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేశారు నెటిజన్లు. దేవుళ్లను తప్పుగా చూపారంటూ న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ దాఖలు చేశారు. రాముడిని క్రూరంగా చూపారని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆదిపురుష్ మూవీకి నోటీసులు జారీ చేసింది.
Related News
Delhi Excise Policy Case: ముగిసిన కేజ్రీవాల్ కస్టడీ.. ఈ రోజు సుప్రీం విచారణ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ అతన్ని రోస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనుంది.