Also Read :Kancha Gachibowli : పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే వాళ్లు జైలుకే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మే 30న భైరవం సినిమా రిలీజ్
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు సినిమాల్లోకి బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ఎంట్రీ ఇచ్చారు. ఈయన 2014లో అల్లుడు శీను మూవీతో హీరోగా అరంగేట్రం చేశారు. డ్యాన్సులు, ఫైట్లతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాక్షసుడు సినిమాతో తన యాక్టింగ్ ట్యాలెంట్ను ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఆయన ఫ్లాప్ సినిమాలకు యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా బెల్లంకొండ సినిమాలకు హిందీ వర్షన్లో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా మే 30న రిలీజ్ కానుంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు.