Taxes Reduce: వచ్చే నెలలో సామాన్యులకు శుభవార్త వినిపించనున్న మోదీ ప్రభుత్వం..?
- By Gopichand Published Date - 09:27 AM, Sun - 23 June 24
Taxes Reduce: లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అందరి చూపు బడ్జెట్పైనే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను వచ్చే నెలలో సమర్పించనున్నారు. దీనికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ప్రతిసారీలాగే ఈసారి కూడా బడ్జెట్పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను (Taxes Reduce) విషయంలో ఈసారి ప్రభుత్వం మార్పులు ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
బడ్జెట్లో చాలా మార్పులు ఉండవచ్చు
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాబోయే బడ్జెట్లో పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించవచ్చు. నివేదిక ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో వినియోగాన్ని పెంచడానికి రూ. 50 వేల కోట్ల (6 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ విలువైన చర్యలను పరిశీలిస్తోంది. తక్కువ సంపాదన ఉన్నవారికి పన్ను రేట్లను తగ్గించడం కూడా సాధ్యమయ్యే చర్యలలో ఉంది.
Also Read: GST On Milk: అన్ని రకాల పాల డబ్బాలపై ఒకే జీఎస్టీ.. ఎంతంటే..?
ఈ ఆదాయ వర్గానికి సంబంధించిన మార్పులు
నివేదిక ప్రకారం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అత్యధికంగా ఖర్చు చేసే పన్ను చెల్లింపుదారులకు పన్ను తగ్గింపులను పరిశీలిస్తున్నారు. అంటే బడ్జెట్లో వార్షిక ఆదాయం రూ. 5 నుంచి 10 లక్షల మధ్య ఉన్న వారికి పన్ను ప్రయోజనాలను అందించవచ్చు. ప్రస్తుతం ఈ ఆదాయ బ్రాకెట్లో 5 నుంచి 20 శాతం వరకు ఆదాయపు పన్ను విధిస్తున్నారు. బడ్జెట్లో ఈ రేట్లు కొంత తగ్గించవచ్చు.
కొత్త పన్ను శ్లాబ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు
బ్లూమ్బెర్గ్ నివేదికలో ఇది చెప్పడమే కాకుండా జూలైలో సమర్పించే పూర్తి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను స్లాబ్ను కూడా ప్రకటించవచ్చని కూడా పేర్కొన్నారు. కొత్త పన్ను శ్లాబ్ మధ్యతరగతిపై కూడా దృష్టి పెట్టనుంది. మొత్తమ్మీద అంచనాలు, క్లెయిమ్లు సరైనవని రుజువైతే వచ్చే బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు చారిత్రాత్మకమైన మార్పుగా నిలుస్తుందని చెప్పవచ్చు.
We’re now on WhatsApp : Click to Join
పరిశ్రమ సంస్థలు కూడా డిమాండ్లు
CII, FICCI వంటి అనేక పరిశ్రమ సంస్థలు కూడా ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుండి వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఎన్నికల అనంతరం ఈ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు పూర్తి బడ్జెట్ జూలై రెండు లేదా మూడో వారంలో వస్తుందని భావిస్తున్నారు.
Tags
Related News
HDFC Credit Card: హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్..!
HDFC Credit Card: డిజిటల్ ఇండియా యుగంలో దాదాపు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని (HDFC Credit Card) ఉపయోగిస్తుంటే ఈ వార్త మీ కోసం మాత్రమే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ ఛార్జీలను మార్చాలని నిర్ణయించింది. బ్యాంక్ ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తాయి. యాప్ ద్వారా చెల్లింపుపై 1 శాతం వరకు వసూలు హెచ్డ