IT Industry Performamce: షాకింగ్ రిపోర్ట్.. మందగిస్తున్న భారత ఐటీ రంగం!
అమెరికా, యూరప్లలో స్థూల ఆర్థిక పరిస్థితి స్థిరపడినప్పుడు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్రాజెక్టులు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కారణంగా ఐటీ కంపెనీలకు డిమాండ్ పెరగవచ్చు.
- By Gopichand Published Date - 07:12 PM, Thu - 2 October 25

IT Industry Performamce: భారతీయ ఐటీ పరిశ్రమ ప్రస్తుతం కొంత నిదానమైన దశను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించి ప్రముఖ ఐటీ కంపెనీల (IT Industry Performamce) ఇటీవల విడుదలైన ఫలితాలు తక్కువ వృద్ధిని సూచిస్తున్నాయి. అయినప్పటికీ ప్రధాన ఎగుమతి మార్కెట్లలో మెరుగుదల, కొత్త సాంకేతికతలను స్వీకరించడం వంటి కారణాల వల్ల ఆర్థిక సంవత్సరం 2026-27లో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.
ఐటీ దిగ్గజాల పనితీరు
హెచ్ఎస్బిసి గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం.. సమీప భవిష్యత్తులో కస్టమర్ల విచక్షణా వ్యయం బలహీనంగానే ఉంటుంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కస్టమర్ల ఖర్చు తగ్గింపులు, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వంటి సవాళ్ల కారణంగా డిమాండ్ ఒత్తిడిలో ఉంది. అదనంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు సమస్యలు, పరిశ్రమ-నిర్దిష్ట జాగ్రత్తలు ప్రాజెక్టులను వాయిదా వేసేందుకు దారితీస్తున్నాయి.
Also Read: Namibia: 2026 టీ20 ప్రపంచ కప్కు అర్హత సాధించిన నమీబియా!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్ వంటి దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో బలమైన బుకింగ్లు, డీల్ల పైప్లైన్ను చూపినప్పటికీ మొత్తం సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనా కేవలం 1-5 శాతంకే పరిమితమైంది. గత సంవత్సరంలో ఎన్ఎస్ఈ ఐటీ ఇండెక్స్ పనితీరు విస్తృత భారతీయ మార్కెట్ కంటే బలహీనంగా ఉంది. ఇది పెట్టుబడిదారుల అప్రమత్తతను సూచిస్తుంది.
ఉద్యోగ భద్రతపై ప్రశ్నార్థకం
ప్రస్తుతం సవాళ్లు ఉన్నప్పటికీ 2026-27లో కొద్దిపాటి మెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అమెరికా, యూరప్లలో స్థూల ఆర్థిక పరిస్థితి స్థిరపడినప్పుడు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్రాజెక్టులు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కారణంగా ఐటీ కంపెనీలకు డిమాండ్ పెరగవచ్చు. దీని ద్వారా భారతీయ ఐటీ సేవల ఆదాయ వృద్ధిలో 2-3 శాతం అదనపు మెరుగుదల సాధ్యమవుతుందని భావిస్తున్నారు.