HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Govt Increases Excise Duty On Petrol Diesel By Rs 2 Per Litre

Petrol- Diesel: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయా? క్లారిటీ ఇదే!

ఎక్సైజ్ సుంకం అనేది ఒక రకమైన పన్ను. దీనిని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై విధిస్తుంది. ఇది ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది.

  • Author : Gopichand Date : 07-04-2025 - 5:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Companies
Indian Companies

Petrol- Diesel: పెట్రోల్, డీజిల్ ధరల (Petrol- Diesel) పెరుగుదల గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎక్సైజ్ సుంకంలో 2 శాతం పెంపును ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని తెలిపింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఎక్సైజ్ సుంక రేట్లలో పెంపు జరుగుతుందని తెలిపాయి. అయితే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదు. రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ లీటరుకు 94 రూపాయలు, డీజిల్ లీటరుకు 87 రూపాయలుగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు 19.90 రూపాయలు, డీజిల్ పై లీటరుకు 15.80 రూపాయలు ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తోంది. ఈ పెంపు తర్వాత పెట్రోల్‌పై లీటరుకు 21.90 రూపాయలు, డీజిల్ పై లీటరుకు 17.80 రూపాయలు ఎక్సైజ్ సుంకం అమలులోకి వస్తుంది.

ఎక్సైజ్ సుంకం అంటే ఏమిటి?

ఎక్సైజ్ సుంకం అనేది ఒక రకమైన పన్ను. దీనిని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై విధిస్తుంది. ఇది ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది. 2014లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు 9.48 రూపాయలు,డీజిల్ పై లీటరుకు 3.56 రూపాయలుగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిని చాలాసార్లు పెంచింది. ఇప్పుడు ప్రభుత్వం సామాన్య ప్రజలపై తమ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.

Also Read: LPG cylinder price Hike : దేశ వ్యాప్తంగా గ్యాస్‌ ధరలు పెంపు

2021లో ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు 27.90 రూపాయలు, డీజిల్ పై లీటరుకు 21.80 రూపాయలు ఎక్సైజ్ సుంకం విధించింది. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఊరటనిస్తూ పెట్రోల్ ధరల్లో 8 రూపాయలు, డీజిల్ ధరల్లో 6 రూపాయలు తగ్గించినట్లు ప్రకటించింది. పెట్రోల్-డీజిల్ బేస్ ధర గురించి చెప్పాలంటే.. భారతదేశంలో ఇది లీటరుకు 32 రూపాయలుగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ వసూలు చేస్తాయి

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్‌పై తమ తమ విధానాల ప్రకారం వ్యాట్, సెస్ వసూలు చేస్తాయి. దీని వల్ల ధరలు మూడు రెట్లు పెరుగుతాయి. ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 104.21 రూపాయలు, చెన్నైలో 100.75 రూపాయలు, కోల్‌కతాలో 103.94 రూపాయలుగా ఉంది. అదే విధంగా ముంబైలో డీజిల్ లీటరుకు 92.15 రూపాయలు, కోల్‌కతాలో 90.76 రూపాయలు, చెన్నైలో 92.34 రూపాయలుగా ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • Diesel Prices
  • Diesel Rates
  • Petrol Prices
  • petrol rates
  • Petrol-Diesel

Related News

Unlimited Notes

ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

వస్తువుల ఉత్పత్తి పెరగకపోయినా, డబ్బు సరఫరా పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గితే ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఇది మార్కెట్‌లో అసమతుల్యతను సృష్టిస్తుంది.

  • Stock Market

    స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

  • Aadhaar

    మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • Petrol

    ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • Google Searches

    ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

Latest News

  • బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

  • చైనా సాయం కోరిన భార‌త్‌.. ఏ విష‌యంలో అంటే?

  • అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!

  • దట్టమైన పొగమంచులో వాహనం నడుపుతున్నారా?

  • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌!

Trending News

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd