HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Supreme Court To Hear Pil On E20 Fuel Policy On September 1

E20 Fuel Policy: సుప్రీంకోర్టుకు చేరిన E20 ఇంధన విధానం.. అస‌లు ఈ20 ఇంధ‌నం అంటే ఏమిటి?

అక్టోబర్ 2026కు ముందు భారతదేశం E20 నుండి మరింత ముందుకు వెళ్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతానికి E20 ఇంధనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  • By Gopichand Published Date - 02:05 PM, Sat - 30 August 25
  • daily-hunt
E20 Fuel Policy
E20 Fuel Policy

E20 Fuel Policy: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో E20 ఇంధనం (E20 Fuel Policy) గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల తమ వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గిందని చాలా మంది కారు, బైక్ యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు. నిజానికి కాలుష్యాన్ని తగ్గించి దేశం సుస్థిరత లక్ష్యాలను సాధించేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 2023లో E20 ఇంధనాన్ని విడుదల చేసింది. అయితే ఈ ఇంధనం పాత, నాన్-E20 వాహనాలకు తప్పనిసరి కావడంతో వాహనదారులలో అసంతృప్తి పెరిగింది.

సుప్రీం కోర్టుకు చేరిన కేసు

వాహన యజమానుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయవాది అక్షయ్ మల్హోత్రా ఈ అంశంపై ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. సెప్టెంబర్ 1, 2025న ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ (జస్టిస్ కె. వినోద్ చంద్రన్, ఎన్వీ అంజారియా) ఈ కేసును విచారించనుంది. ఈ పిటిషన్ ప్రధాన లక్ష్యం వినియోగదారులకు ప్రతి పెట్రోల్ బంకులో E0 పెట్రోల్ (ఎథనాల్ లేని పెట్రోల్) ఎంచుకునే అవకాశం ఉండాలి. అలాగే ఇంధనంపై ఎథనాల్ శాతం స్పష్టంగా లేబుల్ చేయడం తప్పనిసరి కావాలి.

Also Read: Asia Cup 2025: ఆ ఐదుగురు ఆట‌గాళ్లు లేకుండానే దుబాయ్‌కు టీమిండియా?!

ప్రభుత్వం వివరణ

ఈ వివాదం పెరగడంతో భారత ప్రభుత్వం తరఫున నిరంతరం వివరణలు వస్తున్నాయి. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ X (గతంలో ట్విట్టర్)లో ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఎథనాల్ శక్తి సాంద్రత పెట్రోల్ కంటే తక్కువగా ఉండటం వల్ల మైలేజ్‌పై కొద్దిగా ప్రభావం పడుతుంది. E10 నుండి E20కి అనుకూలమైన కార్లలో ఈ ప్రభావం 1-2% వరకు ఉంటుందని, మిగతా వాహనాలలో 3-6% వరకు ఉంటుందని పేర్కొంది. ఇంజిన్ ట్యూనింగ్, E20కి అనుకూలమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఈ ప్రభావాన్ని మరింత తగ్గించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. పెద్ద ఆటోమొబైల్ తయారీదారులు ఇప్పటికే ఈ మార్పులు చేశారని కూడా వివరించింది.

బీమా పాలసీలపై వదంతులు

E20 ఇంధనం ఉపయోగించడం వల్ల వాహన బీమా పాలసీలు రద్దు అవుతాయని పలు చోట్ల వదంతులు వ్యాపించాయి. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. E20ని ఉపయోగించడం వల్ల బీమా పాలసీపై ఎలాంటి ప్రభావం ఉండదని, దాని చెల్లుబాటు ముగియదని ప్రభుత్వం తెలిపింది.

E20 ఇంధనం అంటే ఏమిటి?

E20 ఇంధనం అంటే 20% ఎథనాల్ + 80% పెట్రోల్. కాలుష్యాన్ని తగ్గించడానికి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏప్రిల్ 2023లో దీనిని ప్రారంభించింది.

భవిష్యత్తులో ఏం జరగబోతుంది?

అక్టోబర్ 2026కు ముందు భారతదేశం E20 నుండి మరింత ముందుకు వెళ్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతానికి E20 ఇంధనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే భవిష్యత్తులో మరింత ఎక్కువ ఎథనాల్ కలపాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఈ చర్య భారతదేశాన్ని స్వచ్ఛమైన ఇంధనం వైపు నడిపిస్తుంది. అయితే వాహనదారుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు నిర్ణయం కీలకం కానుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • E20 Fuel Policy
  • Fuel Policy
  • September 1
  • Supreme Court

Related News

Bihar Jdu

Bihar : బిహార్ లో 57 మందితో JDU తొలిజాబితా

Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పాలక జనతాదళ్ (యూనైటెడ్) తమ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 57 మంది పేర్లను ఈ లిస్టులో విడుదల చేసింది

  • Cm Revanth Request

    CM Revanth : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..ఈసారి ఎందుకంటే !!

  • Engine Safety Tips

    Engine Safety Tips: మీకు కారు లేదా బైక్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోస‌మే!

  • Abhishek Sharma

    Abhishek Sharma: రూ. 10 కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • 42 percent reservation for BCs, Governor's quota for Kodandaram, Azharuddin as MLCs

    BC Reservation : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కార్!

Latest News

  • ‎Pregnancy Diet: తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రెగ్నెన్సీ టైంలో వీటిని తప్పకుండా తినాల్సిందే!

  • ‎Diwali: దీపావళి రోజు ఏ దీపాలను వెలిగించాలి.. నూనె, నెయ్యి.. దేనిని ఉపయోగించాలో తెలుసా?

  • ‎Karthika Masam: కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?

  • Harish Rao: భర్తను తలచుకొని ఏడుస్తే.. చిల్లర రాజకీయాలా? – హరీశ్‌రావు ఫైర్

  • Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!

Trending News

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

    • Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

    • Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd