Tesla in India: భారత్ లో టెస్లా EV ఫ్యాక్టరీ
టెస్లా భారత్ లో అడుగుపెట్టాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. ఎలాన్ మస్క్ ఇటీవల మోడీతో భేటీ అనంతరం టెస్లా భారత్ లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో భారత్ మరియు టెస్లా ఓ ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 03:19 PM, Tue - 21 November 23
Tesla in India: టెస్లా భారత్ లో అడుగుపెట్టాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. ఎలాన్ మస్క్ ఇటీవల మోడీతో భేటీ అనంతరం టెస్లా భారత్ లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో భారత్ మరియు టెస్లా ఓ ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఒప్పందం తర్వాత టెస్లా వచ్చే ఏడాది నుండి భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్లో ఈ విషయాన్ని ప్రకటించవచ్చు. గుజరాత్తో పాటు, మహారాష్ట్ర మరియు తమిళనాడు పేర్లు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం పరిగణలోకి తీసుకోనున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఎగుమతులకు పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి టెస్లా 2 బిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడికి రెడీ అయినట్టు సమాచారం. కంపెనీ భారతదేశంలో కొన్ని బ్యాటరీలను తయారు చేస్తుంది, దీని వలన ఖర్చు తగ్గించవచ్చు.జూన్లో, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారతదేశంలో పెట్టుబడుల గురించి మాట్లాడారు. 2024లో భారతదేశాన్ని సందర్శించాలనే తన కోరికను కూడా పునరుద్ఘాటించారు. ప్రస్తుతం భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇది టెస్లాకు పెద్ద అవకాశం కావచ్చు. టెస్లాకు ప్రస్తుతం అమెరికా, చైనా మరియు జర్మనీలలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశీయంగానే ఈవీల తయారీపై మోదీ ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్ పెద్దగా లేదు. మొత్తం వాహనాల్లో ఈవీల సంఖ్య 1.3% మాత్రమే. ఎలక్ట్రిక్ వాహనాల అధిక ధర, ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి. అయినప్పటికీ,ఈవీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Related News
Telegram Down In India: భారత్లో టెలిగ్రామ్ డౌన్.. అయోమయానికి గురైన యూజర్స్..!
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫారమ్ టెలిగ్రామ్ కొంచెం సమయం పని చేయడం ఆగిపోయింది.