HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Phone Tapping Allegations June 2025

YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

  • Author : Kavya Krishna Date : 18-06-2025 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌తో పాటు తన భర్త, సన్నిహితుల ఫోన్‌లు ట్యాప్ చేయబడినట్లు, ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా నిర్ధారించారని ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలు రాజకీయ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్ షర్మిలా తన ఫోన్, భర్త ఫోన్, సన్నిహితుల ఫోన్‌లు ట్యాప్ చేయబడినట్లు ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి, ట్యాప్ చేసిన ఆడియోను వినిపించి ఈ విషయాన్ని నిర్ధారించారని ఆమె తెలిపారు. “ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇది ముమ్మాటికీ నిజం,” అని షర్మిలా పేర్కొన్నారు. అయితే, సుబ్బారెడ్డి ఇప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటారా అనేది అనుమానమేనని ఆమె అన్నారు.

షర్మిలా ఆరోపణల ప్రకారం.. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మధ్య సన్నిహిత సంబంధం నేపథ్యంలో జరిగింది. “వారి సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ట్యాపింగ్ తనను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు.

షర్మిలా తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని జగన్ అడ్డుకోవాలని చూశారని, తన అనుచరులను బెదిరించి, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ఒక ఆయుధంగా ఉపయోగించారని ఆరోపించారు. “నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశాను, కానీ ప్రతి అడుగులో అడ్డుపడ్డారు,” అని ఆమె తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన వారిని భయబ్రాంతులకు గురిచేసి, తన చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక జగన్ , కేసీఆర్ మధ్య జాయింట్ ఆపరేషన్ ఉందని షర్మిలా ఆరోపించారు. “వారు చేసిన అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది,” అని ఆమె అన్నారు. ఈ కేసులో విచారణకు ఎక్కడికైనా వెళ్తానని, ఏ విచారణనైనా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు.

షర్మిలా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కోరారు. “ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ కేసుపై చర్యలు తీసుకోవాలి,” అని ఆమె డిమాండ్ చేశారు. తనకు వ్యక్తిగత గజ్ లేదని, జగన్ తనపై ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడు కూడా తాను కేసు వేయలేదని ఆమె తెలిపారు.

Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Illegal Surveillance
  • kcr
  • Phone tapping
  • Political conspiracy
  • SIT Investigation
  • telangana
  • VY Subba Reddy
  • YS Jagan Mohan Reddy
  • ys sharmila

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd