HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Phone Tapping Allegations June 2025

YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

  • Author : Kavya Krishna Date : 18-06-2025 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌తో పాటు తన భర్త, సన్నిహితుల ఫోన్‌లు ట్యాప్ చేయబడినట్లు, ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా నిర్ధారించారని ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలు రాజకీయ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్ షర్మిలా తన ఫోన్, భర్త ఫోన్, సన్నిహితుల ఫోన్‌లు ట్యాప్ చేయబడినట్లు ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి, ట్యాప్ చేసిన ఆడియోను వినిపించి ఈ విషయాన్ని నిర్ధారించారని ఆమె తెలిపారు. “ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇది ముమ్మాటికీ నిజం,” అని షర్మిలా పేర్కొన్నారు. అయితే, సుబ్బారెడ్డి ఇప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటారా అనేది అనుమానమేనని ఆమె అన్నారు.

షర్మిలా ఆరోపణల ప్రకారం.. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మధ్య సన్నిహిత సంబంధం నేపథ్యంలో జరిగింది. “వారి సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ట్యాపింగ్ తనను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు.

షర్మిలా తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని జగన్ అడ్డుకోవాలని చూశారని, తన అనుచరులను బెదిరించి, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ఒక ఆయుధంగా ఉపయోగించారని ఆరోపించారు. “నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశాను, కానీ ప్రతి అడుగులో అడ్డుపడ్డారు,” అని ఆమె తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన వారిని భయబ్రాంతులకు గురిచేసి, తన చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక జగన్ , కేసీఆర్ మధ్య జాయింట్ ఆపరేషన్ ఉందని షర్మిలా ఆరోపించారు. “వారు చేసిన అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది,” అని ఆమె అన్నారు. ఈ కేసులో విచారణకు ఎక్కడికైనా వెళ్తానని, ఏ విచారణనైనా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు.

షర్మిలా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కోరారు. “ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ కేసుపై చర్యలు తీసుకోవాలి,” అని ఆమె డిమాండ్ చేశారు. తనకు వ్యక్తిగత గజ్ లేదని, జగన్ తనపై ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడు కూడా తాను కేసు వేయలేదని ఆమె తెలిపారు.

Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Illegal Surveillance
  • kcr
  • Phone tapping
  • Political conspiracy
  • SIT Investigation
  • telangana
  • VY Subba Reddy
  • YS Jagan Mohan Reddy
  • ys sharmila

Related News

New Sarpanches

తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

సుదీర్ఘ విరామం తర్వాత గ్రామాల్లో మళ్లీ పాలకవర్గాలు వస్తుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలు, ఇకపై ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. సర్పంచులతో పాటు వార్డు సభ్యులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • Sp Balasubrahmanyam Statue

    ఎస్పీ శైలజ హౌస్‌ అరెస్ట్, రవీంద్రభారతి లో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ!

  • Tpcc Chief Mahesh Goud

    తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

  • Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

    BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

Latest News

  • పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

  • చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

  • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

  • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd