HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Phone Tapping Allegations June 2025

YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

  • Author : Kavya Krishna Date : 18-06-2025 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌తో పాటు తన భర్త, సన్నిహితుల ఫోన్‌లు ట్యాప్ చేయబడినట్లు, ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా నిర్ధారించారని ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణలు రాజకీయ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్ షర్మిలా తన ఫోన్, భర్త ఫోన్, సన్నిహితుల ఫోన్‌లు ట్యాప్ చేయబడినట్లు ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి, ట్యాప్ చేసిన ఆడియోను వినిపించి ఈ విషయాన్ని నిర్ధారించారని ఆమె తెలిపారు. “ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇది ముమ్మాటికీ నిజం,” అని షర్మిలా పేర్కొన్నారు. అయితే, సుబ్బారెడ్డి ఇప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటారా అనేది అనుమానమేనని ఆమె అన్నారు.

షర్మిలా ఆరోపణల ప్రకారం.. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మధ్య సన్నిహిత సంబంధం నేపథ్యంలో జరిగింది. “వారి సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ట్యాపింగ్ తనను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు.

షర్మిలా తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని జగన్ అడ్డుకోవాలని చూశారని, తన అనుచరులను బెదిరించి, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ఒక ఆయుధంగా ఉపయోగించారని ఆరోపించారు. “నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశాను, కానీ ప్రతి అడుగులో అడ్డుపడ్డారు,” అని ఆమె తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన వారిని భయబ్రాంతులకు గురిచేసి, తన చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక జగన్ , కేసీఆర్ మధ్య జాయింట్ ఆపరేషన్ ఉందని షర్మిలా ఆరోపించారు. “వారు చేసిన అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది,” అని ఆమె అన్నారు. ఈ కేసులో విచారణకు ఎక్కడికైనా వెళ్తానని, ఏ విచారణనైనా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు.

షర్మిలా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కోరారు. “ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ కేసుపై చర్యలు తీసుకోవాలి,” అని ఆమె డిమాండ్ చేశారు. తనకు వ్యక్తిగత గజ్ లేదని, జగన్ తనపై ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడు కూడా తాను కేసు వేయలేదని ఆమె తెలిపారు.

Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Illegal Surveillance
  • kcr
  • Phone tapping
  • Political conspiracy
  • SIT Investigation
  • telangana
  • VY Subba Reddy
  • YS Jagan Mohan Reddy
  • ys sharmila

Related News

Engineering counselling in Telangana begins today.

TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

తెలంగాణలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజీ ఎప్‌సెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే అధికారికంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుక

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd