HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ys Jagan Plan For 2024 Elections 3 Capitals Issue

Amaravathi : 2024 వైసీపీ అస్త్రం 3 రాజ‌ధానులు!

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడు రాజ‌ధానుల అంశాన్ని మ‌రింత ఫోక‌స్ చేయాల‌ని వైసీపీ భావిస్తోంది.

  • By CS Rao Published Date - 02:00 PM, Mon - 25 July 22
  • daily-hunt
Ys Jagan Amaravati Lesson
Ys Jagan Amaravati Lesson

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడు రాజ‌ధానుల అంశాన్ని మ‌రింత ఫోక‌స్ చేయాల‌ని వైసీపీ భావిస్తోంది. అదే ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స్కెచ్ వేస్తోంది. ప్రాంతాల మ‌ధ్య ఈ అంశం ప్ర‌ధాన‌మైన‌ది. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర మీద మూడు రాజ‌ధానుల అంశం ప్ర‌భావం చూపుతుంద‌ని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. అందుకే, ఎన్నిక‌ల అమ్ముల పొదిలో మూడు రాజ‌ధానుల అస్త్రాన్ని దాచుకున్న‌ట్టు వైవీ సుబ్బారెడ్డి మాట‌ల ద్వారా స్ప‌ష్టం అవుతోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌రువాత ప‌వ‌ర్ పాయింట్స్ గా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, టీటీడీ చైర్మ‌న్ వై.వీ సుబ్బారెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి, మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నారు. వాళ్లు ఏదైనా చెబితే దాదాపుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి డైరెక్ష‌న్లోనే చెప్పి ఉంటార‌ని భావించాలి. ఆ విష‌యాన్ని ఆ పార్టీ క్యాడ‌ర్ చెప్పుకుంటోంది. తాజాగా అమ‌రావ‌తి రాజ‌ధానిపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించ‌డం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయింది.

మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో భేష‌ర‌తుగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉన్న పిటిష‌న్ల‌కు స‌రైన స‌మాధానం చెప్ప‌లేక ఆ నిర్ణ‌యం తీసుకుంది. కానీ, మూడు రాజ‌ధానుల బిల్లు మ‌ళ్లీ స‌మ‌యం చూసుకుని స‌మ‌గ్రంగా పెడ‌తామ‌ని ఆనాడు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. న్యాయ స్థానాల్లో ఆయ‌న బిల్లు మ‌ళ్లీ పెట్టిన‌ప్ప‌టికీ నిలువ‌ద‌ని భావిస్తోన్న అమ‌రావ‌తి రైతులు ప్ర‌స్తుతం మౌనంగా చూస్తున్నారు. హైకోర్టు డైరెక్ష‌న్ మేర‌కు ప్లాట్ల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. భూములు ఇచ్చిన రైతులు సీఆర్డేయే ప‌త్రాల‌పై సంత‌కాలు చేయాల‌ని ఇటీవ‌ల నోటీసులు కూడా ఇచ్చింది. కానీ, కొంద‌రు ఇప్ప‌టికీ సంత‌కాలు చేయ‌డానికి ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న నిర్మాణాల‌ను పూర్తి చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు సంబంధించిన నిధుల‌ను కూడా విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ప‌నులు నిదానంగా జ‌రుగుతున్నాయి. హ‌ఠాత్తుగా విశాఖ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌స్తావించారు. ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ ఉంటుంద‌ని రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ హోదాలో కార్పొరేట‌ర్ల స‌మావేశంలో వెల్ల‌డించారు.
విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాక పరిపాలనా రాజధాని వస్తుందని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు ప్ర‌ణాళిక‌లు త‌యారు అవుతున్నాయ‌ని చెప్ప‌డం మ‌రోసారి మూడు రాజ‌ధానుల అంశం చ‌ర్చ‌నీయాంశం అయింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Elections
  • 3 capitals issue
  • Amaravati capital
  • kurnool
  • Visakhapatnam
  • YS Jagan Mohan Reddy

Related News

People have immense faith in the judicial system: CM Chandrababu

Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకమే ప్రజలు కోర్టులను ఆశ్రయించడానికి కారణమని అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ‘మధ్యవర్తిత్వం’ (Mediation) ఒక సమర్థవంతమైన మార్గమని పేర్కొన్నారు. వివాదాలను న్యాయపరంగానే కాక, సామరస్యపూరితంగా పరిష్కరించేందుకు ఇది ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

  • Controversy in AP Endowment Department.. The stage is set for the dismissal of the Assistant Commissioner!

    AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!

  • Glass bridge ready for tourists on Kailashgiri in Visakhapatnam..Here is the video of the glass bridge!

    Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!

  • AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

    AP: ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం : సీఎం చంద్రబాబు

Latest News

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd