AP Survey : ఏపీ తాజా సర్వే, టీడీపీ-127, వైసీపీ-8
ఇప్పుడుకిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ రాష్ట్రంలో టీడీపికి 127, వైసీపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని సంచలన సర్వే వెలువడింది. ఆ సర్వేను వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు సేకరించారు. ఒక ప్రైవేటు సంస్థతో చేయించిన సర్వే ను మీడియా ముందుంచారు.
- By CS Rao Published Date - 06:00 PM, Tue - 23 August 22
ఇప్పుడుకిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ రాష్ట్రంలో టీడీపికి 127, వైసీపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని సంచలన సర్వే వెలువడింది. ఆ సర్వేను వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు సేకరించారు. ఒక ప్రైవేటు సంస్థతో చేయించిన సర్వే ను మీడియా ముందుంచారు. రాష్ట్రంలోని 175అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ, వైసీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని `హ్యాష్ ట్యాగ్ యూ` ఆ ప్రైవేటు సంస్థ దగ్గర నుంచి సేకరించింది. నియోజకవర్గాల వారీగా చేసిన చేసిన సర్వే ప్రకారం వచ్చిన రిపోర్టును ఈ వ్యాసంతో పాటు జత చేస్తున్నాం. పరిశీలించవచ్చు.
ఒక యాప్ ద్వారా త్రిబుల్ ఆర్ చేయించిన సర్వే ఆధారంగా ఫలితాల్ని ఆయన మీడియాకు వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వార్ వన్ సైడ్ అంటూ ఆయన వెల్లడించారు. పెద్ద ఎత్తున శాంపిళ్లను శాస్త్రీయంగా జూన్ నుంచి జులై మొదటి వారం సర్వేను నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ 93 స్థానాల్లో కచ్ఛితంగా గెలుస్తుందన్న ఆయన, నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న వాటిల్లో సగం స్థానాలు గెలిచినా తెలుగుదేశం పార్టీకి 127 స్థానాలు వచ్చే వీలుందని అంచనా వేశారు.ఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికార వైసీపీ గురించి చెబుతూ ఎడెనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. మరో మూడు నుంచి నాలుగు స్థానాల్లో విజయవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. ఇంగ్లిషు మీడియా సంస్థలు చేసే సర్వేలను చూసి మురిసిపోతూ కూర్చుంటే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్న ఆయన సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
తాజా సర్వే వివరాల్లో ఆసక్తికర అంశాల్ని చూస్తే..
– టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి 56 శాతం ఓటింగ్ ఉంటే.. వైసీపీకి 34 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు.
– టీడీపీ అగ్రనేతల్లో మరొకరు నారా లోకేశ్ పోటీ చేసే మంగళగిరిలో టీడీపీకి 50 శాతం.. వైసీపీకి 37 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. ఇదే స్థానం నుంచి 2019లో పోటీ చేసిన లోకేశ్ ఓటమిపాలు కావటం తెలిసిందే.
– రాయలసీమలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీ హవా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ.. జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. వార్ వన్ సైడే.
– టీడీపీకి 90 స్థానాలకు పైనే విజయం సాధిస్తుంది. 127 సీట్ల వరకు వచ్చే వీలుంది. వైసీపీ పక్కాగా గెలిచేవి ఎడెనిమిది మాత్రమే. మరో మూడు-నాలుగుస్థానాల్లో విజయానికి ఛాన్సులు ఉన్నాయి.
– నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న 65 స్థానాల్లో 90 శాతం సీట్లలో వైసీపీ విజయం సాధిస్తే 73 సీట్లకు పరిమితమయ్యే వీలుంది.
– ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీగా తలపడే అవకాశం ఉంది. అనంతపురంలో టీడీపీ మెజార్టీ స్థానాలు సొంతం చేసుకొని ఏకపక్ష విజయం ఖాయం.
– ఉమ్మడి ఉభయ గోదావరి జిలలాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంది. గుంటూరు జిల్లాలో విజయవకాశాల్ని పవన్ ప్రభావితం చేస్తారు. నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్న స్థానాల్లో టీడీపీ.. జనసేన రెండుపార్టీలు కలిసి పోటీ చేస్తే, ఈ రెండు పార్టీల అభ్యర్థులు సులువుగా గెలుస్తారు.
నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాల వివరాలను `Hashtag U` సేకరించింది. వాటిని ఈ న్యూస్ తో పాటు జత చేస్తున్నాం. పరిశీలించగలరు.
Related News
AP Politics : వైసీపీ ఎంపీపై మాజీ వాలంటీర్ పోటీ
ఆంధ్రప్రదేశ్లో అత్యంత రసవత్తరమైన బ్యాలెట్ బాక్స్ పోరుకు సిద్ధమైంది.