HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >We Have Made Ap The Only State Without Electricity Shortage Cm Chandrababu

Electricity sector : కరెంట్‌ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం: సీఎం చంద్రబాబు

డిస్ట్రిబ్యూషన్‌, జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌గా విభజించాం. ఎనర్జీ ఆడిటింగ్‌ తీసుకొచ్చాం. ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషించాం. వ్యవసాయానికి యూనిట్‌కు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్‌ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమే అన్నారు.

  • Author : Latha Suma Date : 13-03-2025 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We have made AP the only state without electricity shortage: CM Chandrababu
We have made AP the only state without electricity shortage: CM Chandrababu

Electricity sector : ఏపీ శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..విద్యుత్‌ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. కరెంట్‌ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం. 1988లో విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్‌, జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌గా విభజించాం. ఎనర్జీ ఆడిటింగ్‌ తీసుకొచ్చాం. ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషించాం. వ్యవసాయానికి యూనిట్‌కు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్‌ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమే అన్నారు.

Read Also: Alcohol Addiction: తాగుబోతులుగా మారిన భార్యలు.. భర్తల ఫిర్యాదు

రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 23 శాతం మేర పెరిగిందని సీఎం చెప్పారు. సౌర, పవన విద్యుత్‌ను 7700 మెగావాట్లు మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీ అని చెప్పారు. విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని.. వైసీపీ ప్రభుత్వం లోటు పరిస్థితికి తీసుకెళ్లిందని చంద్రబాబు మండిపడ్డారు. పరిశ్రమలు కరెంట్‌ వాడితే సర్‌ఛార్జీ విధించిన ఘనత ఆ ప్రభుత్వానిదన్నారు. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ కొరత ఉండేది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని సవాల్‌గా తీసుకున్నాను. 2014 డిసెంబర్‌కు ఎక్కడా కరెంట్‌ కొరత లేకుండా చేసి.. జనవరి 2018 నాటికి మిగులు విద్యుత్‌ సాధించిన రాష్ట్రంగా మార్చాను అన్నారు.

ఒక వ్యక్తి ఈగో కారణంగా రాష్ట్ర ఖజనా నుంచి రూ.9 వేల కోట్లు పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-24 మధ్య అసమర్థ పాలనతో రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు. ఆలోచన లేకుండా వైసీపీ ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసేసిందని.. ఆ విషయం అంతర్జాతీయ అంశంగా మారిపోయిందని గుర్తుచేశారు. దావోస్‌లోనూ దీనిపై చర్చ జరిగిందన్నారు. మీటర్‌ రీడింగ్‌ కోసం స్పాట్‌ బిల్లింగ్‌ తీసుకొచ్చాం. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశా.. ప్రపంచ బ్యాంకు జీతగాడు అని నాపై విమర్శలు చేశారు అని చంద్రబాబు అన్నారు. 2014 డిసెంబర్‌కు ఎక్కడా కరెంట్‌ కొరత లేకుండా చేసి.. జనవరి 2018 నాటికి మిగులు విద్యుత్‌ సాధించిన రాష్ట్రంగా మార్చాను. ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.. 9 గంటలు వ్యవసాయానికి కరెంట్‌ ఇస్తున్నాం. నేను 1995లో మొదటిసారి సీఎం అయ్యేసరికి 10 నుంచి 15 గంటల పాటు కరెంట్‌ కోతలుండేవి. పరిపాలన ఎలా ఉండాలో ఆలోచించా.. అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకెళ్లా అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Telangana Assembly : స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతాం: బీఆర్‌ఎస్

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Electricity sector
  • Shortage of current
  • TDP Government
  • ysrcp

Related News

Tdp Announces District Pres

జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు

  • Sanatana Dharma

    దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

  • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

  • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

  • సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd