HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vizianagaram Terror Plans Case Nia Investigation Begins Sirajs Key Links Revealed

Terror Plans Case : విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు.. సిరాజ్ లింకులు వెలుగులోకి

ఈ జాబితాలో సికింద్రాబాద్‌కు చెందిన సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు(Terror Plans Case) కూడా ఉన్నట్లు తెలిసింది.

  • Author : Pasha Date : 20-05-2025 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vizianagaram Terror Plans Case Nia Siraj Mumbai Nia Investigation Andhra Pradesh

Terror Plans Case : విజయనగరం యువకుడు సిరాజ్, సికింద్రాబాద్ యువకుడు సమీర్‌లు కలిసి బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై దర్యాప్తునకు నేరుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. విజయనగరానికి చేరుకున్న ఎన్‌ఐఏ దర్యాప్తు బృందాలు నిందితులను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నాయి. వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నాయి. సిరాజ్, సమీర్‌లను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని ఎన్ఐఏ కోరింది.  ఇక సిరాజ్ వ్యవహారంపై ఏఎస్సైగా పనిచేస్తున్న తండ్రితో పాటు ఎస్‌‌పీఎఫ్‌లో పనిచేస్తున్న సోదరుడికి ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read :Toyota Kirloskar Motor : ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’ ప్రకటించిన టొయోటా కిర్లోస్కర్ మోటర్

ముంబై, ఢిల్లీలకు సిరాజ్.. ఎందుకు ? 

గ్రూప్ 2 కోచింగ్ కోసం విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వెెళ్లిన సిరాజ్‌‌ దారి తప్పాడు. అతడికి వివిధ సోషల్‌ మీడియా యాప్‌లలో ఉగ్రవాద భావజాలం కలిగిన వారు పరిచయమయ్యారు.  ఈ జాబితాలో సికింద్రాబాద్‌కు చెందిన సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు(Terror Plans Case) కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయా వ్యక్తులను కలిసేందుకు ముంబై, ఢిల్లీలకు సిరాజ్ వెళ్లినట్లు సమాచారం.  సిరాజ్‌ 2024 నవంబరు 22న ముంబైకి వెళ్లి 10 మందిని కలిశాడు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో పలువురిని అతడు కలిశాడు. తాను కలిసిన వారందరితో టచ్‌లో ఉండటానికి సిగ్నల్ యాప్‌లో ఒక గ్రూపును సిరాజ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. సిగ్నల్‌ యాప్‌‌లో ఛాట్ చేసుకుంటూ దాడులకు బాంబు పేలుళ్లకు సిరాజ్, సమీర్ వ్యూహరచన చేశారు. సిగ్నల్ యాప్‌లోని సదరు గ్రూప్‌లో ఉన్న ఇతర సభ్యులను కూడా గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు.

Also Read :Diabetes Symptoms: తరచూ మూత్ర విసర్జన మాత్రమే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా షుగర్ ఉందని సూచిస్తాయి!

సిరాజ్, సమీర్‌ల ఛాట్‌లలో ఏముంది ? 

సిరాజ్, సమీర్‌లకు చెందిన సోషల్ మీడియా ఛాట్‌లను పోలీసులు నిశితంగా పరిశీలించారు.  దీన్నిబట్టి ఒక విషయం అర్థమైంది. సిరాజ్, సమీర్ సహా ఈ  యువకులంతా తమ మత వర్గానికి అన్యాయం జరుగుతోందని భావించారు. ఈ అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయారు. వారిలో రేగిన ఈ కోపాన్నే సౌదీ అరేబియాలో ఉంటున్న బిహార్‌కు చెందిన అబూ మూసబ్ ఉగ్రవాదంగా మార్చాడు. సిరాజ్, సమీర్‌లు  అబూ మూసబ్‌తో సోషల్ మీడియాలో ఛాట్ చేసేవారు. అతడి సూచనల మేరకు బాంబు పేలుళ్లకు అవసరమైన రసాయనాల కోసం సిరాజ్ ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చాడని గుర్తించారు.  జనం రద్దీ భారీగా ఉండే ప్రదేశాల్లో ఈ బాంబులను పేల్చాలని సిరాజ్, సమీర్, అబూ మూసబ్ స్కెచ్ గీశారు.  అబూ మూసబ్ ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్టు గుర్తించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • mumbai
  • nia
  • NIA investigation
  • siraj
  • Terror Plans Case
  • Vizianagaram

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • Rohit Sharma

    టీమిండియా స్టార్ రోహిత్ శ‌ర్మ‌కు అరుదైన గౌర‌వం!

Latest News

  • పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !

  • యూజీసీపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!

  • రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

  • ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే

Trending News

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

    • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd