Viveka Murder : ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి సహా నిందితుడిగా సీబీఐ చేర్చింది.
- By Prasad Published Date - 08:39 AM, Tue - 18 April 23
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి సహా నిందితుడిగా సీబీఐ చేర్చింది. ముందస్తు బెయిల కోసం ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. నిన్న ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ రోజుకి వాయిదా వేశారు. అయితే అవినాష్ రెడ్డిని ఈ రోజు సాయంత్ర 4 గంటల తరువాత విచారణ చేయాలని సీబీఐకి హైకోర్టు తెలిపింది. ఈ లోపు ఈ పిటిషన్పై తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు అవినాష్ రెడ్డి పిటిషన్పై తన వాదనలు కూడా వినాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ను కూడా హైకోర్టు ఈ రోజు విచారణ చేయనుంది.
వివేకా హత్య కేసులో నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అవినాష్ రెడ్డి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డిని నిన్న సీబీఐ విచారణకు పిలవగా.. ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా విచారణను పూర్తి చేయాల్సి ఉంది. దీంతో సీబీఐ కేసు విచారణను వేగవంతం చేసింది. ఈ రోజు సాయంత్ర నాలుగు గంటలకు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు.
Related News
Salman Khan : సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు.. జైలులో నిందితుడి సూసైడ్
Salman Khan : బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం ఇటీవల కలకలం రేపింది.