HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijay Sai Reddy To Start A New Tv Channel

Vijay Sai Reddy : తెలుగు మీడియా వార్‌! సాయి రెడ్డి టీవీ ఛాన‌ల్ ప్ర‌క‌ట‌న‌!!

మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నాన‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న వైసీపీలో సంచ‌ల‌నంగా మారింది

  • Author : CS Rao Date : 11-10-2022 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Saireddy Ramoji
Jagan Saireddy Ramoji

మీడియా రంగంలోకి అడుగు పెడుతున్నాన‌ని ఎంపీ విజ‌య‌ సాయి రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న వైసీపీలో సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ (సాక్షి మీడియా సంస్థ) ఆ పార్టీకి సొంతం. కానీ, మ‌రో మీడియా సంస్థ‌ను ప్రారంభిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వైసీపీలో నెంబర్ 1గా ఉన్న జ‌గ‌న్ నెంబ‌ర్ 2గా ఉన్న సాయిరెడ్డిల మ‌ధ్య ఏదైనా జ‌రిగిందా? అనే అనుమానం కలుగుతోంది.

టీవీ ఛానల్ ను పెట్టబోతున్నానని మీడియా స‌మావేశంలో సాయి రెడ్డి అధికారంగా ప్ర‌క‌టించారు. `తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదని, ఏ మీడియా రంగంలో అయితే రామూ (రామోజీరావు) ఉన్నారో , అదే రంగంలోకి తాను ప్రవేశించబోతున్నాను. మీ ఛానల్ ఎలా పనిచేస్తుందో, తాను పెట్టబోయే ఛానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందాం రామూ ` అంటూ సవాల్ విసిరారు. మీ రంగంలోకి తాను ఎంటర్ కాబోతున్నానని ప్ర‌క‌టించారు. అయితే, కేవ‌లం రామోజీరావుకు పోటీగా మాత్ర‌మే వ‌స్తున్నాన‌ని ఆయ‌న చెప్ప‌డం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది.

విశాఖ భూ కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయ‌న‌కు వ్యతిరేకంగా ఇటీవ‌ల రామోజీ మీడియా ప‌లు క‌థ‌నాల‌ను ప్ర‌చురించింది. తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడుతూ రామోజీరావుపై విమర్శలు గుప్పించారు. పేపర్, టీవీ ఉందనే కదా రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అందుకే ఆయ‌న‌కు పోటీ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. స‌రిగ్గా ఇక్క‌డే ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

రెండేళ్లుగా విజ‌య‌ సాయి రెడ్డి, జ‌గ‌న్ మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. విశాఖ కేంద్రంగా చేసుకుని ఆయ‌న చాలా కాలం పాటు రాజ‌కీయాలు న‌డిపారు. ఆయ‌న సీక్రెట్స్ ను చూపే ఒక వీడియో ఏదో ఉంద‌ని ఒక మీడియా పుకార్లు చేసింది. బ‌య‌ట పెడ‌తామ‌ని కూడా బెదిరించింది. కానీ, ఆ వీడియో తాలూకూ గాసిప్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌కు వ‌చ్చాయిగానీ నిజ‌మైన వీడియో ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఆ త‌రువాత తాడేప‌ల్లి కేంద్రంగా జ‌రిగిన పంచాయ‌తీ క్ర‌మంలో విశాఖ వైసీపీ రాజ‌కీయం నుంచి త‌ప్పుకున్నారు. ఉత్త‌రాంధ్ర కో ఆర్డినేట‌ర్ గా వైవీ సుబ్బారెడ్డిని నియ‌మించారు. దీంతో రాజ్య‌స‌భ కూడా రెండోసారి సాయిరెడ్డికి రాద‌ని పుకార్లు పుట్టించారు. కానీ, రెండోసారి రాజ్య‌స‌భ అవ‌కాశం ఇస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు.

మూడు రాజ‌ధానుల అంశం వెనుక విశాఖ‌లో భూ కొనుగోళ్ల వ్య‌వ‌హారం సాయి రెడ్డి వ్య‌వ‌హారం ఉంద‌ని చాలా కాలంగా ఒక వ‌ర్గం మీడియా క‌థ‌నాల‌ను అందిస్తోంది. ఇటీవ‌ల వాటి గురించి మ‌రింత ప్రాచుర్యంలోకి తీసుకురావ‌డంతో పాటు ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం లింకుల‌ను కూడా జోడించ‌డం జ‌రిగింది. దీంతో ఉక్కిబిక్కిరి అవుతోన్న సాయిరెడ్డికి అండ‌గా సాక్షి మీడియా నిల‌బ‌డ‌లేదు. దీంతో ప్ర‌త్య‌ర్థి మీడియాను ఎదుర్కోవ‌డానికి సొంత మీడియా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న భావించిన‌ట్టు ఉన్నారు.

వాస్తంగా సాక్షి మీడియాకు ముందు తెలుగు జ‌ర్న‌లిజంలో ఒక వ‌ర్గానికి చెందిన‌దే పైచేయిగా ఉండేది. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి పవ‌ర్ లోకి రావ‌డానికి బాగా ఉపయోగ‌ప‌డింది. ఆ మీడియా లేక‌పోతే ఆయ‌న ఉనికే ఉండేది కాద‌ని చాలా మంది వైసీపీ వాళ్లు న‌మ్ముతారు. ఆ పార్టీలోని కొంద‌రు మీడియా పెట్ట‌డానికి ముందుకొచ్చిన‌ప్ప‌టికీ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకున్నార‌ని ఏడాది క్రితం ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్పుడు విజ‌య‌ సాయి రెడ్డి మీడియాలోకి అడుగుపెట్ట‌డం రామోజీకి వ్య‌తిరేకంగానా? లేక జగన్ మోహన్ రెడ్డి మీద పైచేయి సాధించ‌డానికా? అనే మ‌రో చ‌ర్చ కూడా బ‌య‌లు దేరింది. ఏదేమైన‌ప్ప‌టికీ మీడియా రంగంలో మ‌రో విప్ల‌వం రాబోతుంద‌ని సాయి రెడ్డి సంకేతం ఇవ్వ‌డం వైసీపీలో క‌ల‌క‌లం బ‌య‌లుదేరింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • ramoji rao
  • telugu media
  • vijay sai reddy
  • YS Jagan Mohan Reddy

Related News

Chandrababu

సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్

చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భార

    Latest News

    • కొన్ని చిట్కాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ చేసుకోవచ్చు..

    • భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

    • క్రికెట‌ర్ సూర్య‌కుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోప‌ణ‌లు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!

    • కేంద్ర ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    Trending News

      • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

      • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

      • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

      • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

      • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd