TTD : ఈ తేదీల్లో వారు తిరుమలకు రావద్దు…!!
వరుస సెలవుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ...వరుస సెలవులు రావడంతో మళ్లీ రద్దీ నెలకొనే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
- By hashtagu Published Date - 06:16 PM, Wed - 10 August 22
వరుస సెలవుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ…వరుస సెలవులు రావడంతో మళ్లీ రద్దీ నెలకొనే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 11 నుంచి 15 వరకు తేదీ వరకు సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది.
రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు కూడా ప్రణాళిక బద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకోని రావాలంటూ టీటీడీ స్పష్టం చేసింది.
Related News
TTD: ఏప్రిల్ 2న ఆళ్వార్ తిరుమంజనం.. పూజరులు ఏం చేస్తారంటే!
ఏప్రిల్ 9వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుకుని ఏప్రిల్ 2వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అయితే.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం తిరుమల ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. ఆళ్వార్ తిరుమంజనం ఏప్రిల్ 2న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తిరుమల అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు