TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలు..
ఈ 18 మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు.
- Author : Latha Suma
Date : 05-02-2025 - 4:43 IST
Published By : Hashtagu Telugu Desk
TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో ఉన్నప్పుడు హిందూయేతర మత ఆచారాలు పాటించిన వారిపై చర్యలకు టీటీడీ సిద్ధమైంది. ఈ మేరకు 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. హిందూయేతర ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీఆర్ఎస్ తీసుకునే వారికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచనలతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబరు 18న టీటీడీ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు చర్యలు తీసున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం.18 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించిన అధికారులు, వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం. ఉద్యోగులను ప్రభుత్వశాఖలకు బదిలీ చేయాలని, లేకుంటే VRS ఇచ్చి పంపాలని టీటీడీ బోర్డు తీర్మానం. #tirumala #ttd #HashtagU pic.twitter.com/Jy02CHE2Y0
— Hashtag U (@HashtaguIn) February 5, 2025
ఈ 18 మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు.
కాగా, తిరుమల హిందూ విశ్వాసం మరియు పవిత్రతకు చిహ్నంగా ఉండేలా చూసుకోవడానికి తన నిబద్ధతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇంతకుముందు నొక్కిచెప్పారు. 1989 ఎండోమెంట్ చట్టం ప్రకారం, టీటీడీ ఉద్యోగులు హిందూ ఆచారాలను పాటించాలి మరియు టీటీడీ పవిత్రతను మరియు భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే ఉల్లంఘనపై బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ నాయకుడు మరియు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ చర్యకు మద్దతు ఇచ్చారు. అవసరమైనంత మంది హిందూయేతర ఉద్యోగులు వెళ్లిపోవడాన్ని చూడటానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
Read Also: Indian Migrants : భారత్ చేరుకున్న 205 మంది వలసదారులు..