HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Totapuri Mango Mis Price Support Ap

AP News : ఏపీ రైతులకు శుభవార్త.. తోతాపురి మామిడి కొనుగోలుపై చారిత్రక ఆమోదం.!

AP News : ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి రకం మామిడి రైతులకు ఊరట కలిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ (MIP)‌ను ఆమోదించింది.

  • Author : Kavya Krishna Date : 22-07-2025 - 4:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu
Cm Chandrababu

AP News : ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి రకం మామిడి రైతులకు ఊరట కలిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ (MIP)‌ను ఆమోదించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2025-26 మామిడి సీజన్‌కు తోతాపురి మామిడిపై మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) కింద ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ (PDP) ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మాసాని, MIS కింద PDP ఆమోదించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ పథకం కింద 1.62 లక్షల టన్నుల తోతాపురి మామిడికి క్వింటాల్‌కు రూ.1,490.73 మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర (MIP)గా నిర్ణయించారు. కేంద్రం-రాష్ట్రం సమానంగా (50:50) ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా ఈ సాయం అందజేయబడుతుంది. “ఈ చర్యతో రైతులు ధర పతనం నుంచి రక్షించబడతారు, న్యాయమైన ఆదాయం పొందుతారు. గ్రామీణ జీవనోపాధి బలపడుతుంది,” అని చంద్రశేఖర్ తెలిపారు.

Bhagyashri Borse : వయ్యారానికి కేరాఫ్ అడ్రస్ మారిన భాగ్యశ్రీ బోర్సే

తోతాపురి మామిడి ధరలు గణనీయంగా పడిపోవడంతో కిలోకు అదనంగా రూ.4 చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.260 కోట్లు విడుదల చేసిందని ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. కేంద్రం మంగళవారం ఈ రూ.260 కోట్లలో రూ.130 కోట్లు రాష్ట్రానికి తిరిగి చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర పథకం కోసం కేంద్ర విమానయాన మంత్రి కిన్జరాపు రామమోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. తోతాపురి మామిడిపై MIS పథకాన్ని కేంద్రం మొదటిసారి ప్రకటించిందని చంద్రశేఖర్ తెలిపారు.

ఈ ఏడాది తోతాపురి మామిడి మార్కెట్ ధరలు భారీగా పడిపోవడంతో రైతులకు పెద్ద నష్టాలు వాటిల్లాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో అవసరమైతే MIS సపోర్ట్ కొనసాగించాలనుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం తోతాపురి మామిడి రైతులకు కనీస ధర అందించేందుకు ప్రస్తుత సీజన్‌లో 6.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేయాలని ఉద్యాన , పట్టు శాఖ డైరెక్టర్‌ను అనుమతించింది.

దీంతో కిలోకు కనీస ధర రూ.12 అందేలా చర్యలు తీసుకుంది. పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీలు రూ.8 చెల్లిస్తే, మిగతా రూ.4 ప్రభుత్వమే భరిస్తుంది. ఈ చర్యతో కలిపి చిత్తూరు జిల్లాలో మామిడి సాగు కొనసాగించేందుకు రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని, డిస్ట్రెస్‌ సేల్స్‌ (బలవంతపు అమ్మకాలు) నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Train Video: పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే!? రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని రీల్, ఇదిగో వీడియో!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh farmers
  • Chandra Sekhar Pemmasani
  • Mango Price
  • Market Intervention Scheme
  • Totapuri Mango

Related News

Farmers Drumstick

ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Farmers :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునగ సాగును ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక, రైతు సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు, విత్తనాలు, నీరు, ఎరువులు, పర్యవేక్షణ వంటి అన్ని దశల్లోనూ సహకారం అందిస్తోంది. రెండేళ్లలో ఎకరాకు రూ.1.32 లక్షలు మంజూరు చేస్తూ, మూడు నెలల్లోనే ఆదాయం వచ్చేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జ

    Latest News

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

    • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    Trending News

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd