Andhra Pradesh : రూ.81 లక్షల విలువైన సెల్ఫోన్లను రికవరీ చేసిన తిరుపతి పోలీసులు
ఏపీ పోలీసులు ప్రవేశపెట్టిన సరికొత్త టెక్నాలజీ 'మొబైల్ హంట్ యాప్స తో తిరుపతి పోలీసులు సుమారు రూ.81 లక్షల విలువైన
- By Prasad Published Date - 08:04 AM, Wed - 9 August 23
ఏపీ పోలీసులు ప్రవేశపెట్టిన సరికొత్త టెక్నాలజీ ‘మొబైల్ హంట్ యాప్స తో తిరుపతి పోలీసులు సుమారు రూ.81 లక్షల విలువైన 450 చోరీ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని యజమానులకు అప్పగించారు. రికవరీ చేసిన మొబైల్స్ ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవని అడిషనల్ ఎస్పీ వెంకట్రావు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికుల ఫోన్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఒక నెలలో చోరీకి గురైన 450 మొబైల్స్ రికవరీ చేశామని.. తిరుపతి పోలీసులు 1,630 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారని.. వీటి మొత్తం విలువ రూ.2.93 కోట్లు ఉంటుందని తెలిపారు.
ప్రజలు తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 9490617873 (మొబైల్ హంట్ యాప్)కు ఫిర్యాదు చేయాలని అడిషనల్ ఎస్పీ వెంకట్రావు ప్రజలను కోరారు. యాప్లో ఫిర్యాదు చేసిన తర్వాత, ఫిర్యాదుదారుడు మొబైల్ వివరాలను అందజేస్తూ ఫిర్యాదు చేసినందుకు లింక్తో పాటు రసీదుని పొందుతారని తెలిపారు. మొబైల్ ఫోన్లో నిల్వ చేసిన సమాచారం లేదా డేటా దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి పోలీసులు CIER (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సహాయంతో ఫోన్ను బ్లాక్ చేస్తారని ఆయన వివరించారు.
Related News
AP : ఏపిలో ఎన్నికల హింస పై డీజీపీకి సిట్ నివేదిక అందజేత!
Election violence in AP: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ తర్వాత జరిగిన హింస(violence)పై సిట్(Sit) తన ప్రాథమిక నివేదిక(Preliminary report)ను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హి�