HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >They Increased The Charges They Staged The Protests Jagans Fault Minister Gottipati

Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్‌దే పాపం : మంత్రి గొట్టిపాటి

జగన్‌ హయాంలో విద్యుత్‌ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్‌ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

  • By Latha Suma Published Date - 03:15 PM, Tue - 4 March 25
  • daily-hunt
They increased the charges, they staged the protests.. Jagan's fault: Minister Gottipati
They increased the charges, they staged the protests.. Jagan's fault: Minister Gottipati

Electricity Charges : విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం వైసీపీ అధినేత జగన్‌దేనని ఆరోపించారు. ఆయన ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ రంగంలో చేసిన పాపాలే ఇప్పుడు ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలకు ఉరితాళ్లయ్యాయని విమర్శించారు. జగన్‌ హయాంలో విద్యుత్‌ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్‌ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.  పీపీఏలను రద్దు చేయడం, ఏపీ జెన్‌కోను దెబ్బతీయడం, ప్రజావసరాల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వంటి చర్యలు ప్రజలకు భారంగా మారాయని తెలిపారు.

Read Also: RTC : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు : ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !

డిస్కంలు ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీకి ప్రతిపాదించినప్పటికీ, 2024 ఎన్నికల వేళ వీటిని వసూలు చేస్తే, నాటి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వాయిదా వేశారని మంత్రి రవికుమార్‌ తెలిపారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు అనుమతించారని ఆయన ఆరోపించారు. జగన్‌ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని, 2023-24 సంవత్సరానికి మరో రూ.11,826 కోట్ల భారం ప్రజలపై పడబోతోందని మంత్రి రవికుమార్‌ పేర్కొన్నారు. ఇక, ఈ వేసవి కాలంలో రోజువారీ విద్యుత్ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి.

ముందస్తు ప్రణాళికలతో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని మంత్రి సూచించారు.పెరుగుతున్నవిద్యుత్ వినియోగ డిమాండ్‌ను తీర్చడానికి ప్ర‌త్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని, ముఖ్యంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 22,709 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది. డిమాండ్ మేరకు రైతులకు అవసరమైన‌న్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు సిద్దంగా ఉండాలి. వేసవి కాలంలో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనెక్షన్ల ప్రాసెసింగ్ వేగవంతం చేయాలి అన్నారు. అలాగే ఆర్డీఎస్‌ఎస్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవ‌డం, నష్టాలను తగ్గించడం, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్ నెట్వర్కలను ఆధునీకరించడంపై అధికారులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.

Read Also: INDvAUS : టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Electricity Charges
  • Electricity sector
  • Electricity tariff hike
  • gottipati ravi kumar
  • Legislative Council
  • tdp
  • YCP members
  • ys jagan
  • ysrcp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

Latest News

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd