HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp St Cell President Dharunaik Comments On Ysrcp Leaders

Andhra Pradesh : తిరుపతి హథీరాంజీ ట్రస్టు భూములపై వైసీపీ నేత‌ల డేగల కన్ను.. ప్లాట్లు వేసి అమ్మకానికి పెడుతున్న వైనం

బంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైసీపీ నాయకత్వం తలమునక‌లైందని టీడీపీ ఎస్టీ సెల్

  • Author : Prasad Date : 25-11-2023 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
hatriram
hatriram

బంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైసీపీ నాయకత్వం తలమునక‌లైందని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ధారు నాయక్ తెలిపారు. ట్రస్టుకు చెందిన వందలాది ఎకరాల భూములపై వైసీపీ నాయకుల డేగ కళ్లు పడ్డాయని..వైసీపీకి చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామీ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిలు కలిసి ట్రస్టు భూములను దోచుకోవాలని చూస్తున్నారని ధారు నాయక్ ఆరోపించారు. 1843 నుంచి ఎంతో ప్రసిద్ది చెందిన హధీరాంజీ మఠానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంజారా/లంబాడీ/సుగాలీలు దర్శనం చేసుకుంటార‌ని… అంతటి చరిత్ర కలిగిన ట్రస్టుపై వైసీపీ నాయకుల కన్ను పడటం దురదృష్టకరమ‌న్నారు. ట్రస్టుకు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని ఆయ‌న తెలిపారు. ట్రస్టు మహంతు అర్జున్‌దాసుపై లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను అన్యాయంగా తొలగించి ట్రస్టు ఆస్తులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని దాదాపు 350 ఎకరాలు మఠం భూములను నారాయణ స్వామీ, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలు భూముల్లో ప్లాట్లు వేసి వాటిని అమ్ముకుంటూ  కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవిలాల పంచాయతీలోని సర్వే నెం.135.139.253.238, 12.321 17/2 17/5 148/2 లోని 45 ఎకరాలు కబ్జా చేశారని ధారు నాయక్ తెలిపారు. చంద్రగిరి మండలం, అగరాల గ్రామంలోని సర్వేనెంబర్ 140.71, 134.110/1 లలో గల 40 ఎకరాలు, మంగళంలోని సర్వే నెం. 216, 86.109 లలోని రెండు ఎకరాలు, పేరూరులోని సర్వేనెంబర్ 173, 171లలోని 10 ఎకరాలు, పుదీపట్ల గ్రామ పంచాయతీలోని సర్వేనెంబర్ 51/1 377.382లలో 40 ఎకరాలను ఇప్పటికే కబ్జా చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం మఠం అభివృద్ధిని గాలికి వదిలేసి భూములను దోచుకోవాలని చూడటం దుర్మార్గమ‌న్నారు.వైసీపీ నాయకుల భూ కబ్జాలకు సహకరిస్తూ చట్ట వ్యతిరేకంగా పనులకు పాల్పడుతున్న అధికారులు కూడా శిక్షార్డులే గమనించాలని… అధికారులు వైసీపీ నాయకుల ప్రలోభాలకు తలొగ్గకుండా మఠం ఆస్తులను కాపాడాలని ఆయ‌న కోరారు.

Also Read:  TDP : “బీసీల వెన్ను విరుస్తున్న జగన్” పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేత‌లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • hatriram
  • hatriram Trust
  • land scam
  • tdp
  • tirupathi
  • ysrcp

Related News

Tdp Announces District Pres

టీడీపీ లో ఒకేసారి 1,050 మందికి పదవులు

TDPలో ఒకేసారి 1,050 మందికి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల్లో పదవులు దక్కనున్నాయి. ఒక్కో కమిటీలో 9 మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ట్రెజరర్, మీడియా కో-ఆర్డినేటర్

  • Egg prices soar, burden on the nutritional needs of the common man

    కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Latest News

  • ఇక పై చాట్‌జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!

  • 17 ఏళ్ల నిర్బంధానంతరం బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?

  • జైలర్ 2’లో బాలీవుడ్ బాద్షా ? రివీల్ చేసిన మిథున్ చక్రవర్తి !

  • బీఎల్‌వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!

  • క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది: ప్రధాని మోడీ

Trending News

    • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

    • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

    • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd