AP Politics: వెంటిలేటర్పై టీడీపీ .. జగన్ అందుకే ఢిల్లీ వెళ్లారు
టీడీపీ బలహీనంగా ఉందని, చంద్రబాబు తాను ఎన్నోసార్లు తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎంతకైనా తెగించవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
- By Praveen Aluthuru Published Date - 09:24 PM, Thu - 8 February 24
AP Politics: టీడీపీ బలహీనంగా ఉందని, చంద్రబాబు తాను ఎన్నోసార్లు తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎంతకైనా తెగించవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్కు ఉనికి లేదని చెప్పారు. టీడీపీ వెంటిలేటర్పై ఉందని ఆయన కూడా ఒప్పుకుని ఉండాలని ఎద్దేవా చేశారు. గతంలో పదే పదే తిట్టిన బీజేపీతోనే చంద్రబాబు పొత్తుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
ప్రస్తుతం వస్తున్నసర్వేలపై వైఎస్సార్సీపీ పెద్దగా ఆధారపడదని సజ్జల అన్నారు. మేము గతంలో కూడా సర్వేలను తలకిందులు చేయడంలో విజయం సాధించామని తెలిపారు. ఏపీలో వైసీపీ మరోసారి చరిత్రను పునరావృతం చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇలాంటి సర్వేలు మన నమ్మకాన్ని వమ్ము చేయలేవు. మళ్లీ గెలుస్తామని 100 శాతం నమ్మకం ఉందని సీ ఓటర్ సర్వేపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పెండింగ్లో ఉన్న నిధులను రాబట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి వెళ్లారని, వీలైతే ఇతర కేంద్ర మంత్రులను కూడా కలుస్తానని చెప్పారు. వైఎస్ షర్మిలను చంద్రబాబు నాడు మౌత్ పీస్గా అభివర్ణించారని, ఇప్పుడామె చంద్రబాబు రాసిన స్క్రిప్ట్నే చదువుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు మా నాయకుడిని 16 నెలల పాటు జైలులో ఉంచడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Hyderabad: డీసీఎం ఢీ కొట్టడంతో కన్నతల్లి ముందే బాలుడి దుర్మరణం
Tags
Related News
Chevireddy Bhaskar Reddy : వైసీపీ క్యాడర్ను చెవిరెడ్డి నమ్మడం లేదా..?
ఏపీలో రాజకీయాల్లో నమ్మకమనే మాటకు విలువ లేకుండా పోతోంది. కొందరు నేతలు పార్టీలను వీడి మరో పార్టీ పంచన చేరుతున్నారు.