TDP vs YCP : ఆర్యవైశ్యులంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష? : టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ కు టీడీపీ నేత డూండి రాకేష్ ప్రతిసవాల్ విసిరారు. డిసెంబర్ 3న ఉదయం
- By Prasad Published Date - 08:20 AM, Mon - 27 November 23
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ కు టీడీపీ నేత డూండి రాకేష్ ప్రతిసవాల్ విసిరారు. డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రెడీ అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ ను సీఎం కాకుండా మాజీ సీఎం రోశయ్య అడ్డుకున్నారనే అక్కసుతో ఆర్యవైశ్యులపై కక్ష కట్టడం తగదని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోందని… ఆర్యవైశ్య సోదరులపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. కులగణన తెచ్చి వైశ్యుల్లో చీలిక తెచ్చారని… ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత, నిధులు, కార్పొరేషన్ ఇవేవీ అవసరం లేనట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. చంద్రగిరి పోలీసు స్టేషన్ లో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఆర్యవైశ్యుడిని బెదిరిస్తే పెట్రోల్ మీద వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తే దీనిపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నాలుగున్నర సంవత్సరాలలో 13 మంది ఆర్యవైశ్యులు ఆత్మహత్య చేసుకున్నారని.. విపరీత ట్యాక్సులు వేసి ఆర్యవైశ్యులను ఇబ్బంది పెడుతున్నారని డూండి రాకేష్ తెలిపారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగిగినా కోట్లాది రూపాయలు వ్యాపరస్థులను బెదిరించి దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కార్తిక పౌర్ణమి రోజున కృష్ణా నది ఒడ్డున కనకదుర్గమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న పున్నమి ఘాట్ లో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ గారి స్థలంలో ఆర్యవైశ్యులం ప్రతి సంవత్సరం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించుకుంటారని.., ఎప్పటిలాగే ఈ యేడాది నిర్వహించదలచుకుంటే దాన్ని అడ్డుకుంటున్నారన్నారు. పేద ఆర్యవైశ్యులు తమ జీవితాల్లో మార్పు రావాలని వాసవీ ఫౌండేషన్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కలిసి 19వ తేదిన సత్యనారాయణ స్వామి వ్రతాలు పెట్ట దలచి.. 20 రోజులకు ముందే అనుమతికై దరఖాస్తు చేసుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. 3 పేజీల నోటీసు ఇచ్చి మీరు వన సమారాధన చేసుకోవడానికి వీలు లేదన్నారని తెలిపారు.
కల్యాణ మండపాల్లో నిర్వహించదలచుకుంటే కల్యాణ మండపాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదని సర్కులర్ పాస్ చేశారని… సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించరాదని 30 యాక్టు పెట్టారని రాకేష్ ఆరోపించారు. కొణజేటి రోశయ్యపై ఉన్న కోపాన్ని మీరు ఆర్యవైశ్యులపై తీర్చుకుంటున్న మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అడ్డుకొని వెల్లంపల్లి శ్రీనివాస్ పాపం మూటగట్టుకున్నాడని.. జగన్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినవారిని ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు. హిందూయిజాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే.. చూస్తూ ఊరుకోమన్నారు. తొందరలోనే ఆర్యవైశ్యులందరం ఏకమౌతామని. . డిసెంబర్ 3 వ తేదిన 11.30కు తాను బహిరంగకు సిద్ధమని తెలిపారు.. ఆర్యవైశ్యులపై వైసీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలను సాక్షాలతో సహా వచ్చి బయట పెడతానని తెలిపారు. ధైర్యం ఉంటే వెల్లంపల్లి బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
Related News
AP Elections : ఏపీ ఎన్నికల్లో.. మహిళలు ఎలా ఓటు వేశారు..?
రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం EVMలలో మూసివేయబడింది, ఫలితాలు జూన్ 4న మాత్రమే వెలువడతాయి. ఎగ్జిట్ పోల్ లేదా పోస్ట్ పోల్ సర్వేలను ఇవ్వకుండా టెలివిజన్ ఛానెల్లు, సర్వే ఏజెన్సీలను ఎన్నికల సంఘం నిషేధించింది. కాబట్టి సస్పెన్స్ కొనసాగుతోంది.