TDP : జగన్ రెడ్డికి ఓటమి భయంతోనే ఈ అక్రమ అరెస్టులు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా
అక్రమ కేసులు, అరెస్టులనే జగన్మోహన్ రెడ్డి నమ్ముకు న్నాడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
- By Prasad Published Date - 07:22 PM, Wed - 15 November 23
అక్రమ కేసులు, అరెస్టులనే జగన్మోహన్ రెడ్డి నమ్ముకు న్నాడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నాలుగున్నరేళ్ల పాలనా కాలాన్ని కేవలం రాజకీయ కక్షసాధింపులకే వెచ్చించిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని తెలిపారు. విజిలెన్స్.. సీఐడీ.. సీబీసీఐడీ.. పోలీస్ విభాగాలను తన స్వార్థానికి, తన కక్ష సాధింపులకు వాడుకుంటూ, అభివృద్ధి సంక్షేమాలను పూర్తిగా విస్మరించాడన్నారు. 10 నెలల క్రితం కేసుపెట్టడమేంటి…ఇప్పుడు కడపలో టీడీపీనేత బీటెక్ రవిని అరెస్ట్ చేయడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ.. పాలకుల రాజకీయ కక్షసాధింపులకోసం పనిచేస్తున్న ఏ అధికారిని..ఏ విభాగాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసేవారికి సహకరిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్న అధికారులందరూ కచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబడతారని.. జైళ్లలో శిక్ష అనుభవిస్తారని తెలిపారు. ప్రలోభాలు.. పదవులు..ఎరవేసి ఇప్పుడు అధికారులతో పనిచేయించుకుంటున్న జగన్ రెడ్డి, అధికారం కోల్పోగానే రాష్ట్రం నుంచి పారిపోతారని తెలిపారు. అచ్చెన్నాయుడు.. కొల్లు రవీంద్ర…యనమల రామకృష్ణుడు.. కాలవ శ్రీనివాసులు.. చినరాజప్ప.. అయ్యన్నపాత్రుడు ఇలా అందరిపై తప్పుడు కేసులు పెట్టించారని.. సీఐడీ అధికారులు అర్థరాత్రి గోడలు దూకి వెళ్లి మరీ అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ విధంగా హద్దుదాటి వ్యవహరిస్తున్న ఎస్సై నుంచి ఎస్పీ వరకు ఎవరినీ వదిలిపెట్టమన్నారు.
Also Read: Tcongress: కాంగ్రెస్ వీడిన గాలి అనిల్ కుమార్
Related News
Flood Victims : వరద బాధితులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు
ఇళ్లు నీట మునిగిన ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు