HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Gives Strict Message To Party Leaders Who Are Not Aggressive On Issues

Chandrababu Naidu: డ్రామాలాడే లీడర్లకు టీడీపీ చెక్

డ్రామాలు వేసే నాయకులకు చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు.

  • By CS Rao Published Date - 12:21 AM, Mon - 5 September 22
  • daily-hunt
CBN Trend
CBN

డ్రామాలు వేసే నాయకులకు చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. అలాంటి వాళ్లకు ఎన్నికల్లో టిక్కెట్ రాదని తేల్చేశారు. కొందరు పోరాటం చేయకుండా నటిస్తున్నారని , అలాంటి వాళ్ళ జాబితా ఉందని హెచ్చరించారు. పద్దతి మార్చుకుంటే బాగుంటుందని , లేదంటే ఇతరులకు అవకాశం ఇస్తానని కుండబద్దలు కొట్టారు. దీంతో టీడీపీలోని పనిచేయని, క్యాడర్ ను పట్టించుకోని లీడర్లకు ఆందోళన మొదలైంది. కనీసం 50 మంది నియోజకవర్గ ఇంఛార్జీలను మార్చుతారని ఆ పార్టీలోని టాక్.
టీడీపీలో కొంతమంది నేతలు ఒళ్లు వంచడం లేదని చంద్రబాబు మందలించారు. ప్రజా సమస్యలపై పోరు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహంచారు. తమను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని చెబుతూ,కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పడం సరికాదని చురకలేశారు. కొంతమంది నేతలు పోలీసులతో వాదించి, గృహనిర్బంధాలను ఛేదించుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారంటూ డ్రామాలాడే నేతలను చంద్రబాబు నిలదీసినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజా సమస్యలపై నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతారని, అయితే ఏమవుతుందని చంద్రబాబు ఆ లీడర్లను ప్రశ్నించినట్టు సమాచారం. తనతోపాటు తన కుమారుడు నారా లోకేష్, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వంటివారిపైనా కేసులు పెట్టారని చంద్రబాబు గుర్తు చేసినట్టు వినికిడి. ప్రజా సమస్యలపై పోరాడే నేతలపై కొన్ని కేసులు పెడతారని, వాటికి భయపడి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఎలా అని చంద్రబాబు గట్టిగానే కొంతమంది నేతలకు క్లాస్ తీసుకున్నారట.

ఇకపై పార్టీ కార్యక్రమాలు ప్రజా సమస్యలపై నిర్వహించే పోరులో పాల్గొనని వారిని నిశితంగా పరిశీలిస్తామని చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. పోరాడకుండా ఇంట్లోనే కూర్చుని, నటిస్తున్నవారి వివరాలను రికార్డు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో ఉండి కూడా కొంతమంది నేతలు ఆయా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని, కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన అవసరం లేదా అని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎవరు పనిచేస్తున్నారో? ఎవరు పనిచేయడం లేదో ?పార్టీ కార్యాలయానికి మొత్తం సమాచారం వస్తోందని చంద్రబాబు హెచ్చరించారు.
వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతలుగా ఎదుగుతారని చంద్రబాబు పార్టీ నేతలకు హితభోద చేశారట. పార్టీ కోసం పనిచేయనివారిని మోయాల్సిన అవసరం తనకు లేదని చంద్రబాబు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీకేమీ నాయకుల కొరత లేదని.
ప్రతిచోటా 10 మంది సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికి కూడా మారకపోతే కఠిన చర్యలు తప్పవని డ్రామాలాడే లీడర్లకు ఆఖరి ఛాన్స్ ఇచ్చారట. రాబోవు రోజుల్లో కనీసం 50 మందికి టీడీపీ చెక్ పెట్టనుందని తెలుస్తోంది. ఇదే ఆ పార్టీలోని హాట్ టాపిక్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • chandrababu naidu
  • TDP cheif
  • tdp leaders

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Cm Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్

  • CM Chandrababu

    CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd