TDP : వైసీపీ పాలనలో పేదరికం పెరిగింది – భవిష్యత్ గ్యారంటీ బస్సుయాత్రలో టీడీపీ నేతలు
వైసీపీ నాలుగేళ్ల పాలనలో పేదలు నిరు పేదలుగా మారిపోయారని టీడీపీ నేతలన్నారు. పేదలను ధనికుల్ని చేయాలన్నదే
- By Prasad Published Date - 10:21 PM, Thu - 29 June 23
వైసీపీ నాలుగేళ్ల పాలనలో పేదలు నిరు పేదలుగా మారిపోయారని టీడీపీ నేతలన్నారు. పేదలను ధనికుల్ని చేయాలన్నదే చంద్రబాబు నాయడు లక్ష్యమని, టీడీపీ మినిమ్యానిఫెస్టోతో ప్రజల జీవితాల్లో మార్పులు ఖాయమన్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రజా చైతన్య బస్సు యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్ గ్యారంటీ బస్సు యాత్ర లో భాగంగా గురువారం జోన్ -1 పరిధిలో దక్షిణ నియోజకవర్గం జ్ఞానపురం ఎర్ని మాంబ ఆలయం వద్దనుండి ప్రారంభమైంది. బీచ్ రోడ్డు జాలారిపేట వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర మత్స్యకారుల యొక్క సమస్యలను తెలుసుకున్నారు. దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి నేతృత్వంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయంలో అమ్మవారికి పూజలు చేసి యాత్ర ప్రారంభించారు ఆలయం వద్ద నుండి వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సెంట్ పీటర్ ఎయిడెడ్ పాఠశాల వద్దకు వెళ్లి దానిని పరిశీలించారు. అక్కడి నుండి చెత్త పేరుకుపోయిన ఎర్రి గెడ్డ వద్దకి వెళ్లారు. అక్కడి నుండి బయలుదేరి పూర్ణ మార్కెట్ చేరుకొని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని జగదాంబ కూడలి మీదుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని సంక్షేమం కుంటుపడిందని రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్ గ్యారంటీ బస్సు యాత్రని చంద్రబాబునాయుడు ప్రారంభించారని చెప్పారు
Related News
Shyamala Devi : జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ.. నరసాపురంలో గెలుపు పక్కా..
నేడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి నరసాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున పాల్గొన్నారు.