Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. మూడు గేట్లు ఎత్తివేత
గత కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం..
- By Prasad Published Date - 10:46 AM, Tue - 11 October 22
గత కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,07,853 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో మూడు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి 83,811 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు స్టేషన్లలో విద్యుదుత్పత్తి అనంతరం సాగర్కు 66,199 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 2,750 క్యూసెక్కులు, హంద్రీ-నీవా సుజల స్రవంతిలోకి 338 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 884.70 అడుగుల స్థాయిలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయంలోకి 1,46,318 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 12 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 96,696 క్యూసెక్కుల నీటిని వదిలేందుకు 32,967 క్యూసెక్కుల వినియోగాన్ని విద్యుత్ ఉత్పత్తికి మొత్తం 1,29,663 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలు, వరద కాల్వలు, ఎస్ ఎల్ బీసీలకు మొత్తం 16,665 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో 589.60 అడుగుల స్థాయిలో 310.8498 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి 1,21,235 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
Related News
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.