HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Speculations Of Hyderabad Common Capital For 30 Years On Social Media

Hyderabad Common Capital : మ‌రో 30ఏళ్లు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్?

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప‌దేళ్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని.

  • Author : CS Rao Date : 23-05-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Buildings
Hyderabad Buildings

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప‌దేళ్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని. ఆ లోపుగా రాజ‌ధాని నిర్మించుకోలేని ప‌రిస్థితిలో ఏపీ ఉంటే, ఏమ‌వుతుంది? ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉండేలా పొడిగిస్తారు. అంతేకాదు, హైద‌రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాల‌ని ప్ర‌తిపాద‌న కూడా ఉంది. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని మ‌రో 30 ఏళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉంటుంద‌ని స‌రికొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది. క‌నుక, విభ‌జ‌న చ‌ట్టం అనుస‌రించి ఏపీ, తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా ఉమ్మ‌డి హైద‌రాబాద్ ను మ‌రో 30 ఏళ్లు కొన‌సాగించాల‌న్న డిమాండ్ వ‌స్తోంది. ఉమ్మ‌డి రాజ‌ధాని సాధ‌న‌తో పాటు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కూ కృషి చేయ‌నున్నామ‌ని ఏపీ ఉద్య‌మకారులు గ‌ళం వినిపిస్తున్నారు. విప‌క్ష , అధికార ప‌క్ష నేత‌లు రాజ‌కీయాలు విడిచి రాష్ట్రం శ్రేయోస్సు కోసం త‌మ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అటు చంద్ర‌బాబును, ఇటు జ‌గ‌న్ ను వేడుకుంటున్నారు.

ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద్రాబాద్ ను డిక్లైర్ చేసి దాదాపు ఎనిమిదేళ్లు అయింది. మ‌రో రెండేళ్ల‌లో ఉమ్మ‌డి రాజ‌ధాని హైద్రాబాద్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఉమ్మ‌డి రాజ‌ధాని అంశాన్ని తెర‌పైకి వ‌స్తోంది. అంటే ఆ రోజు ప‌దేళ్లు (విభ‌జ‌న చ‌ట్టం అనుస‌రించి) ఉమ్మ‌డి రాజ‌ధాని అని డిక్లైర్ చేశాక, ఏపీ స‌ర్కారు పెద్ద‌లు మాత్రం అక్క‌డ ఉండ‌లేం అని, ఓటు కు నోటు కేసు ఉదంతం త‌రువాత వ‌చ్చేశారు. త‌రువాత కాలంలో ఉమ్మ‌డి ఆస్తులు, ఉమ్మ‌డి హక్కుల‌పై ఎవ్వ‌రూ పెద్ద‌గా మాట్లాడిన దాఖ‌లాలు లేవు. తాజాగా మారుతున్న పరిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఉమ్మ‌డి రాజ‌ధాని అన్న ప‌దాన్ని తెర‌పైకి వ‌స్తుంది. ఎందుకంటే, 9, 10 షెడ్యూల్ ఆస్తులు తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. వాటి విలువ సుమారు 5ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఆ ఆస్తుల కోసం ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ ను వ‌దులుకునే ప‌రిస్థితి ఉండ‌దు. న్యాయ పోరాటం చేసైనా స‌రే హైద‌రాబాద్ ను ఉమ్మ‌డిగా ఉంచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. లేదంటే 9, 10 షెడ్యూల్ ఆస్తుల‌ను పంచివ్వాల‌ని డిమాండ్ చేస్తుంది.

ఈ సారి ఉమ్మ‌డి రాజ‌ధాని ప‌ది కాదు ఇర‌వై కాదు ఏకంగా 30 ఏళ్లు ఉంచాల‌న్న డిమాండ్ తో కొంద‌రు ఉద్య‌మించేందుకు సిద్ధం అవుతున్నారు. ఒంగోలు కేంద్రంగా స్టూడెంట్ జేఏసీ నేత‌లు ఈ నినాదం వినిపిస్తున్నారు. ఇదే నినాదంతో తాము ఇక‌పై మ‌రింతగా కార్యాచ‌ర‌ణ‌ను విస్తృతం చేయ‌నున్నామ‌ని చెబుతున్నారు. ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఏపీ, టీజీల‌కు సంబంధించి భాగ్య‌న‌గ‌రిని ఉంచుతూ, 30 ఏళ్ల పాటు సంబంధిత నిర్ణ‌యం అమ‌లు అయ్యేలా చేయ‌మ‌ని కోరుతూ పార్ల‌మెంట్ లో చ‌ట్టం చేయ‌మ‌ని చ‌ట్ట స‌భ‌లకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వీరంతా వేడుకుంటున్నారు..

విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు సాధ్యం కాని విష‌యంగా మారిపోయిన ప్ర‌స్తుత త‌రుణంలో కొన్ని పాత ప్ర‌తిపాద‌న‌లే తెర‌పైకి కొత్త రూపం అందుకుని వ‌స్తున్నాయి. రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండిపోయింద‌న్న ఆవేద‌న‌తో రానున్న కాలంలో మ‌రిన్ని ఉద్య‌మాలు ఉమ్మ‌డి రాజ‌ధాని కొన‌సాగింపు దిశ‌గా సాగ‌నున్నాయి. రాజ‌కీయ పార్టీల తీరు ఎలా ఉన్నా విశ్వ విద్యాల‌యాల‌కు సంబంధించిన స్టూడెంట్ జేఏసీలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు పూర్తి స్థాయిలో చేయ‌డం అసాధ్యం. స‌రిగ్గా అదే అంశాన్ని వినిపిస్తూ మ‌రో 30 ఏళ్లు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉండేలా ఉద్య‌మించ‌డానికి ఏపీ స్టూడెంట్స్ సిద్ధం కావ‌డం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • common capital
  • hyderabad
  • telangana

Related News

Satya Kumar Dares Jagan

జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

పీపీపీ వైద్య కళాశాలలను వ్యతిరేకిస్తూ ఒక కోటి సంతకాలను సమర్పించామని జగన్ గవర్నర్‌ను కలిసిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఆ సంతకాలన్నీ నకిలీవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ ఇలా చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది.

  • Christmas Holidays 2025 Sch

    విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

  • Maoists Khali

    తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

  • యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd