HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Speculations Of Hyderabad Common Capital For 30 Years On Social Media

Hyderabad Common Capital : మ‌రో 30ఏళ్లు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్?

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప‌దేళ్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని.

  • Author : CS Rao Date : 23-05-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Buildings
Hyderabad Buildings

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప‌దేళ్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని. ఆ లోపుగా రాజ‌ధాని నిర్మించుకోలేని ప‌రిస్థితిలో ఏపీ ఉంటే, ఏమ‌వుతుంది? ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉండేలా పొడిగిస్తారు. అంతేకాదు, హైద‌రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాల‌ని ప్ర‌తిపాద‌న కూడా ఉంది. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని మ‌రో 30 ఏళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉంటుంద‌ని స‌రికొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది. క‌నుక, విభ‌జ‌న చ‌ట్టం అనుస‌రించి ఏపీ, తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా ఉమ్మ‌డి హైద‌రాబాద్ ను మ‌రో 30 ఏళ్లు కొన‌సాగించాల‌న్న డిమాండ్ వ‌స్తోంది. ఉమ్మ‌డి రాజ‌ధాని సాధ‌న‌తో పాటు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కూ కృషి చేయ‌నున్నామ‌ని ఏపీ ఉద్య‌మకారులు గ‌ళం వినిపిస్తున్నారు. విప‌క్ష , అధికార ప‌క్ష నేత‌లు రాజ‌కీయాలు విడిచి రాష్ట్రం శ్రేయోస్సు కోసం త‌మ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అటు చంద్ర‌బాబును, ఇటు జ‌గ‌న్ ను వేడుకుంటున్నారు.

ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద్రాబాద్ ను డిక్లైర్ చేసి దాదాపు ఎనిమిదేళ్లు అయింది. మ‌రో రెండేళ్ల‌లో ఉమ్మ‌డి రాజ‌ధాని హైద్రాబాద్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఉమ్మ‌డి రాజ‌ధాని అంశాన్ని తెర‌పైకి వ‌స్తోంది. అంటే ఆ రోజు ప‌దేళ్లు (విభ‌జ‌న చ‌ట్టం అనుస‌రించి) ఉమ్మ‌డి రాజ‌ధాని అని డిక్లైర్ చేశాక, ఏపీ స‌ర్కారు పెద్ద‌లు మాత్రం అక్క‌డ ఉండ‌లేం అని, ఓటు కు నోటు కేసు ఉదంతం త‌రువాత వ‌చ్చేశారు. త‌రువాత కాలంలో ఉమ్మ‌డి ఆస్తులు, ఉమ్మ‌డి హక్కుల‌పై ఎవ్వ‌రూ పెద్ద‌గా మాట్లాడిన దాఖ‌లాలు లేవు. తాజాగా మారుతున్న పరిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఉమ్మ‌డి రాజ‌ధాని అన్న ప‌దాన్ని తెర‌పైకి వ‌స్తుంది. ఎందుకంటే, 9, 10 షెడ్యూల్ ఆస్తులు తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. వాటి విలువ సుమారు 5ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఆ ఆస్తుల కోసం ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ ను వ‌దులుకునే ప‌రిస్థితి ఉండ‌దు. న్యాయ పోరాటం చేసైనా స‌రే హైద‌రాబాద్ ను ఉమ్మ‌డిగా ఉంచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. లేదంటే 9, 10 షెడ్యూల్ ఆస్తుల‌ను పంచివ్వాల‌ని డిమాండ్ చేస్తుంది.

ఈ సారి ఉమ్మ‌డి రాజ‌ధాని ప‌ది కాదు ఇర‌వై కాదు ఏకంగా 30 ఏళ్లు ఉంచాల‌న్న డిమాండ్ తో కొంద‌రు ఉద్య‌మించేందుకు సిద్ధం అవుతున్నారు. ఒంగోలు కేంద్రంగా స్టూడెంట్ జేఏసీ నేత‌లు ఈ నినాదం వినిపిస్తున్నారు. ఇదే నినాదంతో తాము ఇక‌పై మ‌రింతగా కార్యాచ‌ర‌ణ‌ను విస్తృతం చేయ‌నున్నామ‌ని చెబుతున్నారు. ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఏపీ, టీజీల‌కు సంబంధించి భాగ్య‌న‌గ‌రిని ఉంచుతూ, 30 ఏళ్ల పాటు సంబంధిత నిర్ణ‌యం అమ‌లు అయ్యేలా చేయ‌మ‌ని కోరుతూ పార్ల‌మెంట్ లో చ‌ట్టం చేయ‌మ‌ని చ‌ట్ట స‌భ‌లకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వీరంతా వేడుకుంటున్నారు..

విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు సాధ్యం కాని విష‌యంగా మారిపోయిన ప్ర‌స్తుత త‌రుణంలో కొన్ని పాత ప్ర‌తిపాద‌న‌లే తెర‌పైకి కొత్త రూపం అందుకుని వ‌స్తున్నాయి. రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండిపోయింద‌న్న ఆవేద‌న‌తో రానున్న కాలంలో మ‌రిన్ని ఉద్య‌మాలు ఉమ్మ‌డి రాజ‌ధాని కొన‌సాగింపు దిశ‌గా సాగ‌నున్నాయి. రాజ‌కీయ పార్టీల తీరు ఎలా ఉన్నా విశ్వ విద్యాల‌యాల‌కు సంబంధించిన స్టూడెంట్ జేఏసీలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు పూర్తి స్థాయిలో చేయ‌డం అసాధ్యం. స‌రిగ్గా అదే అంశాన్ని వినిపిస్తూ మ‌రో 30 ఏళ్లు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉండేలా ఉద్య‌మించ‌డానికి ఏపీ స్టూడెంట్స్ సిద్ధం కావ‌డం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • common capital
  • hyderabad
  • telangana

Related News

Son Writes Exam Hours After Father's Death

గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదు

  • Telugu States IRCTC Special Trains

    తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Minister Uttam Holds High L

    Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Gandhi Sarovar Musi

    Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

  • Minister Lokesh

    విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

Latest News

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd