HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sirajur Rahman From Vizianagaram Came To Hyderabad For Group 2 Coaching Turned To Terrorism

Hyderabad Blasts Plan : గ్రూప్‌ 2 కోచింగ్‌ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు

విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.

  • Author : Pasha Date : 19-05-2025 - 2:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Blasts Plan Sirajur Rahman Vizianagaram Hyderabad Group 2 Coaching Terrorism

Hyderabad Blasts Plan : ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌, తెలంగాణలోని సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌ల అరెస్టు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఇద్దరూ కలిసి హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి.  తాజా అప్‌డేట్స్‌ను ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Yusuf Pathan : అఖిల పక్ష బృందం నుంచి పఠాన్ ఔట్.. టీఎంసీ సంచలన నిర్ణయం

సిరాజ్ నేపథ్యం.. గ్రూప్ 2 కోచింగ్.. 

  • విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.
  • సిరాజ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
  • సిరాజ్‌ తండ్రి ఏపీ పోలీసు శాఖలో  ఏఎస్సై. అతడి సోదరుడు కానిస్టేబుల్‌.
  • సిరాజ్‌‌ను కూడా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేర్పించాలని అతడి తండ్రి భావించారు.
  • గ్రూప్‌ 2 పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్‌‌కు సిరాజ్‌ను పంపారు.
  • హైదరాబాద్‌లో ఉండగా సోషల్ మీడియాలో సిరాజ్ బిజీ అయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు.
  • ఈక్రమంలోనే సౌదీ అరేబియాలో ఉంటున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఒకరితో సిరాజ్‌కు పరిచయం ఏర్పడింది.
  • ఇదే వ్యవధిలో సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌‌తోనూ సిరాజ్‌కు స్నేహం ఏర్పడింది. ఈ ఇద్దరూ కలిసి ఐసిస్ హ్యాండ్లర్‌కు దగ్గరయ్యారు.
  • అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను సిరాజ్ ఏర్పాటు చేయగా, అందులో సభ్యుడిగా సమీర్ చేరినట్లు పోలీసులు చెబుతున్నారు.
  • హైదరాబాద్‌లో  గ్రూప్‌ 2 కోచింగ్‌‌ను సిరాజ్ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత విజయనగరానికి తిరిగి వెళ్లిపోయాడు.
  • విజయనగరంలో నుంచే సౌదీ అరేబియాలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్‌తో సిరాజ్ సంప్రదింపులు జరిపాడు.  సికింద్రాబాద్‌లో ఉన్న సమీర్‌తోనూ టచ్‌లో ఉన్నాడు.
  • ఐసిస్ హ్యాండ్లర్ సలహాల మేరకు పేలుడు పదార్ధాల తయారీకి అవసరమైన కెమికల్స్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చాడు. వాటిని తన ఇంటికి తెప్పించుకున్నాడు.
  • సిరాజ్ తెప్పించుకున్న రసాయనాల జాబితాలో పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటివి ఉన్నాయి.
  • ఈ రసాయనాలతో బాంబులు తయారుచేసి మే 21, 22 తేదీల్లో విజయనగరంలో పేలుళ్ల రీహార్సల్ చేయాలని సిరాజ్, సమీర్ నిర్ణయించారు.
  • పేలుడు పదార్థాల కోసం సిరాజ్ ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చాక.. భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది.  అక్కడి నుంచి తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగానికి, వారి నుంచి ఏపీ పోలీస్ ఇంటెలీజెన్స్ విభాగానికి సమాచారం చేరింది.
  • ఆ వెంటనే శనివారం రోజు (మే 17న) విజయనగరంలో ఉన్న సిరాజ్ ఇంటిపై పోలీసులు రైడ్స్ చేశారు. పేలుడు పదార్థాల తయారీకి వాడే కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
  •  తదుపరిగా ఏపీ, తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగాల అధికారులు సికింద్రాబాద్‌లో సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
  • ట్రాన్సిట్ వారంట్‌పై సమీర్‌ను హైదరాబాద్ నుంచి విజయనగరానికి తరలించారు.
  • సిరాజ్‌, సమీర్‌లకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Also Read :Mysore Rajamata : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత భారీ విరాళం.. ప్రమోదాదేవి గురించి తెలుసా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • Group 2 Coaching
  • hyderabad
  • Hyderabad Blasts Plan
  • sirajur rahman
  • telangana
  • terrorism
  • vijayanagaram
  • Vizianagaram

Related News

New Amrit Bharat Express.

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd