Senior Journalist Kommineni: తుళ్లూరు పోలీస్ స్టేషన్కు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని!
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంబంపాటి శిరీష ఫిర్యాదుతో పాటు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలు, మహిళా రైతులు కూడా ఫిర్యాదులు చేశారు.
- Author : Gopichand
Date : 09-06-2025 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
Senior Journalist Kommineni: సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును (Senior Journalist Kommineni) ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 9, 2025న హైదరాబాద్లోని జర్నలిస్ట్స్ కాలనీలోని అతని నివాసంలో అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో అతన్ని ఏ2గా పేర్కొంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్ట్ తర్వాత కొమ్మినేనిని విజయవాడకు తరలించి, గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధం చేశారు.
కేసు నేపథ్యం సాక్షి టీవీలో జూన్ 6, 2025న ప్రసారమైన చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణం రాజు అమరావతిని “వేశ్యల రాజధాని” అని వ్యాఖ్యానించడంతో మొదలైంది. కొమ్మినేని ఈ చర్చను సమన్వయం చేస్తూ ఈ వ్యాఖ్యలను ఖండించకుండా వాటిని పరోక్షంగా సమర్థించినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమరావతి రైత మహిళలు, భూమి ఇచ్చిన వారిని అవమానించాయని ఫిర్యాదులు వచ్చాయి.
Also Read: RCB Legal Battle: కర్ణాటక హైకోర్టుకు ఆర్సీబీ.. కోర్టు ఏం చెప్పిందంటే?
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంబంపాటి శిరీష ఫిర్యాదుతో పాటు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలు, మహిళా రైతులు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ కేసులో ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, భారతీయ న్యాయ సంహిత, సమాచార సాంకేతిక చట్టం కింద అనేక సెక్షన్లలో నిందితులపై కేసులు నమోదయ్యాయి. కృష్ణం రాజు (ఏ1) పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. దీనిని వైఎస్సార్సీపీ నేతృత్వంలోని సాక్షి మీడియా ద్వారా అమరావతిపై జరిగిన కుట్రగా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్ ఈ ఆరోపణలను తిరస్కరించి, టీడీపీ రాజకీయ లబ్ధి కోసం ఈ ఘటనను వాడుకుంటోందని ఆరోపించారు. అమరావతిలో మహిళలు, రైతులు సాక్షి కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టారు. టీవీ ఛానల్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.