1 Killed : భీమిలిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
విశాఖపట్నంలోని భీమిలి బీచ్ రోడ్డులో అతివేగంగా వాహనం నడపడంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు
- By Prasad Published Date - 11:47 AM, Sun - 27 August 23
విశాఖపట్నంలోని భీమిలి బీచ్ రోడ్డులో అతివేగంగా వాహనం నడపడంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాసన్స్ బే కాలనీకి చెందిన పెండ్యాల ప్రఖ్యాత్ (20), సీతమ్మధారకు చెందిన కోళ్ల అఖిలేష్, ఎండాడకు చెందిన ఆర్ సాయిలక్ష్మి ముగ్గురు స్నేహితులు.. అయితే ప్రఖ్యాత్, అఖిలేష్ రుషికొండలోని GITAM కళాశాలలో కంప్యూటర్ సైన్స్ (CSC) మూడవ సంవత్సరం చదువుతుండగా, సాయిలక్ష్మి BBA డిగ్రీని అభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం కాలేజీలో కలుసుకున్న ముగ్గురు ఒకే కారులో భీమిలిలో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. దురదృష్టవశాత్తు, తిరిగి వస్తుండగా ఐఎన్ఎస్ కళింగ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని చెట్టును ఢీకొట్టింది. ప్రఖ్యాత్కు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రఖ్యాత్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కారు వెనుక కూర్చున్న అఖిలేష్, సాయిలక్ష్మి గాయాలతో బయటపడ్డారు. వారికి వైద్య చికిత్స అందించి అనంతరం డిశ్చార్జి చేశారు. ప్రఖ్యాత్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, వాహనాన్ని అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ప్రఖ్యాత్ తండ్రి అరవింద్ నగరంలో వ్యాపారి, అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రఖ్యాత్ మృతదేహానికి భీమిలి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.
Related News
Teen Driver : టీనేజీ డ్రైవర్ ఇద్దరిని బలిగొన్న కేసు.. మైనర్ తండ్రి అరెస్ట్
మహారాష్ట్రలోని పూణేలో ఉన్నకళ్యాణి నగర్లో ఓ టీనేజర్ లగ్జరీ పోర్షే కారును ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఇద్దరి చావుకు కారణమైన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.