HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Relief For Kukkala Vidyasagar In Mumbai Actress Jethwani Case As High Court Grants Bail

Jathwani Case Latest Updates: ముంబై నటి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో ఊరట..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన జత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు చివరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. ఈ మేరకు, నిందితుడు కుక్కల విద్యాసాగర్ తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.

  • By Kode Mohan Sai Published Date - 05:54 PM, Mon - 9 December 24
  • daily-hunt
Jathwani Case Latest Updates
Jathwani Case Latest Updates

ముంబై నటి జత్వాని ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు ఏపీ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ జత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు చివరకు బెయిల్ లభించింది.

ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కుక్కల విద్యాసాగర్ తన పిటిషన్ దాఖలు చేశాడు. జత్వాని తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. వారు బెయిల్ మంజూరు చేస్తే, నిందితుడు కేసును ప్రభావితం చేయవచ్చని హెచ్చరించారు.

ఇదే సమయంలో, విద్యాసాగర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన, నిందితుడు 76 రోజులుగా జైలులో ఉన్నందున, బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ముందు వాదించారు. ఇరువురి వాదనలు పూర్తయ్యాయి, మరియు కోర్టు ఈ కేసులో తన తీర్పును సోమవారం వాయిదా వేసింది. తర్వాత న్యాయస్థానం, విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వానిని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి జత్నాని కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, విద్యాసాగర్‌ పరారయ్యాడు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కొన్నిరోజులు తలదాచుకున్నాడని పోలీసులు గుర్తించారు. చివరికి డెహ్రాడూన్‌లో ఉన్నప్పుడు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత, అతన్ని ట్రాన్సిట్ వారెంట్‌ ఆధారంగా విజయవాడకు తీసుకువచ్చి, అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు.

ఈ కేసులో, కాదంబరి జత్నాని తనపై తప్పుడు కేసు నమోదు చేసి మానసికంగా వేధించారని ఆరోపిస్తూ, కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, క్రాంతిరానా, విశాల్‌గున్నీ తదితర పోలీసు అధికారులపై ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 13న కేసు నమోదు చేశారు. కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ వివిధ సెక్షన్ల కింద కేసు దాఖలైంది.

జత్వాని విజయవాడలో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, విద్యాసాగర్‌ పరారీలో ఉన్నాడు. ఈ కేసు సంబంధిత సమాచారం మీడియాకు లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని, కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాదంబరి కేసును సీరియస్‌గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విచారణకై ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరి, తండ్రి నరేంద్రకుమార్ జత్నాని, తల్లి ఆశా జత్నాని నుంచి వాంగ్మూలాలు సేకరించి 100 పేజీల విచారణ నివేదికను రూపొందించారు.

ఈ విచారణలో, కాదంబరి నాలుగు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెలుగు చూసింది. మూడు సార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, క్రాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. విద్యాసాగర్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించగా, చివరికి అతన్ని డెహ్రాడూన్ లో పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణా, విశాల్ గున్నిలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసారు. అధికార దుర్వినియోగం ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడినట్లు వెల్లడైంది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591, 1592 విడుదల చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను “కాన్ఫిడెన్షియల్” గా వెబ్‌సైట్‌లో పేర్కొంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Kadambari Jethwani
  • Kadambari Jethwani Case
  • Kukkala Vidya Sagar
  • ys jagan

Related News

Investment In Ap

Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

Investments : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్‌ఏఈఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (SAEL Industries) రాష్ట్రంలో రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను

  • Hinduja Group

    Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

  • CM Chandrababu

    CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • Stampede In Srikakulam Kasi

    Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

  • Ap House Land Is Now Yours

    AP Govt Good News : రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు

Latest News

  • Woman Suicide : చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

  • PAN- Aadhaar: పాన్ కార్డు ఉన్న‌వారికి బిగ్ అల‌ర్ట్‌.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే ఛాన్స్‌!

  • RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

  • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

  • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd