HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Regional Politics In Andhra Pradesh Tirupathi By Elections

ఏపీ రాజ‌కీయాల్లో `సంప్ర‌దాయ` వేడి..బ‌ద్వేల్, నంద్యాల‌, తిరుప‌తి ఉప చ‌ర్చ

సిట్టింగ్ ఎమ్మెల్మే మ‌ర‌ణిస్తే..అదే కుటుంబానికి చెందిన స‌భ్యులు మ‌ళ్లీ పోటీ చేస్తే ఏక‌గ్రీవంగా గెలిపించ‌డం రాజ‌కీయ సంప‌ద్రాయం. దాన్ని ఉమ్మ‌డి ఏపీలో అనుస‌రించిన తొలి పార్టీ తెలుగుదేశం.

  • Author : Hashtag U Date : 21-10-2021 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

సిట్టింగ్ ఎమ్మెల్మే మ‌ర‌ణిస్తే..అదే కుటుంబానికి చెందిన స‌భ్యులు మ‌ళ్లీ పోటీ చేస్తే ఏక‌గ్రీవంగా గెలిపించ‌డం రాజ‌కీయ సంప‌ద్రాయం. దాన్ని ఉమ్మ‌డి ఏపీలో అనుస‌రించిన తొలి పార్టీ తెలుగుదేశం. ఆ నాటి నుంచి ఆ సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తోంది. కానీ, దాని వెనుక ఉన్న రాజ‌కీయ కోణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బ‌ద్వేల్ ఉప ఎన్నిక నుంచి టీడీపీ దూరం ఉండ‌డం వ్యూహంలో భాగ‌మ‌ని వైసీపీ వ‌ర్గాల భావిస్తున్నాయి. సంప్ర‌దాయాన్ని అనుకూల రాజ‌కీయ అడుగుల దిశ‌గా తీసుకెళుతున్నార‌ని బీజేపీ కూడా ఆక్షేపిస్తోంది.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత సిట్టింగ్ ఎమ్మెల్యేలు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో జ‌రిగిన ఎన్నిక‌లు ప్ర‌ధానంగా మూడు. నంద్యాల ఎమ్మెల్యేగా కొన‌సాగుతూ భూమా నాగిరెడ్డి 2017లో చ‌నిపోయాడు. అసెంబ్లీ రికార్డుల ప్ర‌కారం వైసీపీ ఎమ్మెల్యే..కానీ, చ‌నిపోయేనాటికి ఆయ‌న టీడీపీలో ఉన్నాడు. ఆ స‌మ‌యంలో సంప్ర‌దాయాన్ని వైసీపీకి గుర్తు చేసింది టీడీపీ. పార్టీ ఫిరాయింపు కింద భావించిన వైసీపీ బ్ర‌హ్మానంద‌రెడ్డిని రంగంలోకి దింపింది. భూమా అఖిల‌ప్రియ‌ను టీడీపీ అభ్య‌ర్థిగా నిలిపారు. హోరాహోరీగా జ‌రిగిన ఆ ఎన్నిక‌లో అఖిల‌ప్రియ గెలిచింది. ఈ ఎన్నిక సంప్ర‌దాయ విరుద్ధంగా జ‌ర‌గ‌డానికి కార‌ణం వైసీపీ అంటున్నారు టీడీపీ శ్రేణులు.

తిరుప‌తి లోక్ స‌భ ఎంపీ బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ హ‌ఠాత్మ‌ర‌ణం చెంద‌డంతో అక్కడ ఇటీవ‌ల ఉప ఎన్నిక జ‌రిగింది. దుర్గా ప్ర‌సాద్ కుటుంబానికి వైసీపీ తిరిగి టిక్కెట్ ఇవ్వ‌లేదు. దుర్గా ప్ర‌సాద్ కుమారుడు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తికి ఎమ్మెల్సీ ప‌ద‌విని వైసీపీ ఇచ్చింది. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల బ‌రిలోకి డాక్ట‌ర్ గురుమూర్తిని దింపింది. ఈ ఎన్నిక‌లో సీనియ‌ర్ లీడ‌ర్ ప‌న‌బాక లక్ష్మిని అభ్య‌ర్థిగా టీడీపీ నిలిపింది. ఇక్క‌డ సంప్ర‌దాయానికి టీడీపీ భిన్నంగా వ్య‌వ‌హ‌రించింద‌ని వైసీపీ, బీజేపీ అంటున్నాయి.

దుర్గా ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులు కాకుండా డాక్ట‌ర్ గురుమూర్తికి టిక్కెట్ ఇచ్చారు క‌నుక పోటీకి దిగామ‌ని టీడీపీ లాజిక్ చెబుతోంది. ఆ ఉప ఎన్నిక‌లో బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ‌, టీడీపీ అభ్య‌ర్థిగా ప‌న‌బాక తీవ్రంగా ప్ర‌చారం చేశారు. జ‌న‌సేనాని ప‌వ‌న్, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో పాటు బీజేపీ అతిర‌థులు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. ఇదే త‌ర‌హాలో టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ లోకేశ్ తో పాటు సీనియ‌ర్లు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను చూపారు. తీరా, ఫ‌లితాలను చూస్తే వైసీపీ అభ్య‌ర్థి గురు మూర్తి 2.40లక్ష‌ల మోజార్టీ పైగా సాధించాడు. విచిత్రంగా బీజేపీ, టీడీపీ అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు గ‌ల్లంతు అయ్యాయి.


ప్ర‌స్తుతం బ‌ద్వేల్ ఉప ఎన్నిక వ‌చ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బ‌య్య మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న స‌తీమ‌ణి సుధ‌కు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. సంప్ర‌దాయం ప్ర‌కారం పోటీ నుంచి వైదొలుగుతున్నామ‌ని టీడీపీ, జ‌న‌సేన ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఎందుకంటే, ఏక‌గ్రీవం కోసం వైసీపీ అభ్య‌ర్థ‌న చేయ‌లేదు. పైగా ప్ర‌త్య‌ర్థుల ఇష్ట‌మ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల ప‌రోక్షంగా పోటీకి స‌వాల్ చేశాడు. కానీ, వ్యూహాత్మ‌కంగా టీడీపీ, జ‌న‌సేన సంప్ర‌దాయం కార్డును ఉప‌యోగించి బ‌రిలోకి దిగ‌కుండా ప‌క్క‌కు త‌ప్పుకున్నాయి. బీజేపీ మాత్రం వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేక‌మ‌ని చెబుతూ బ‌ద్వేల్ లో పోటీ చేస్తోంది.

ఏపీ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన మూడు ఉప ఎన్నిక‌ల్లో మూడు ర‌కాలు టీడీపీ వ్య‌వ‌హ‌రించింది. నంద్యాల, తిరుప‌తి, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో సంప్ర‌దాయాన్ని అనుకూల రాజ‌కీయాల‌కు మ‌లుచుకుందని ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ బాట‌న జ‌న‌సేన కూడా న‌డుస్తోంది. వాస్త‌వంగా బ‌ద్వేల్ లో పోటీ చేసిన‌ప్ప‌టికీ తిరుప‌తి ఫ‌లితాలు రిపీట్ అవుతాయ‌ని ప్ర‌త్య‌ర్థుల‌కు తెలియ‌ని విషయం కాదు. అందుకే, సంప్ర‌దాయం పేరుతో సేఫ్ సైడ్ ను టీడీపీ, జ‌న‌సేన ఎంచుకున్నాయి. ఇదే ఏపీలో పెద్ద హాట్ టాపిక్ కావ‌డం స‌హ‌జమే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhuma akhila priya
  • chandrababu naidu
  • tdp
  • tirupati mp gurumurthy
  • ys jagan

Related News

Minister Vasamsetti Subhash

భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ బుక్స్‌లో 99 శాతం మంది భక్తులు సానుకూల స్పందన ఇచ్చారని మంత్రి తెలిపారు.

  • AP Deputy CM Pawan Kalyan Strong Warning to YSRCP

    మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Latest News

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

  • ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే శ్రీవారి మహిమ వెనుకనున్న పురాణ గాథ తెలుసా?

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd