HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rajahmundry Andhra Paper Mill Lockout

Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..

  • Author : Vamsi Chowdary Korata Date : 02-05-2026 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Paper Mill Lokout
Andhra Paper Mill Lokout

Andhra Paper Mill Lokout  తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్‌ మిల్లు యూనిట్‌లో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులతో యాజమాన్యం చర్చలు జరపనుంది.

తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. పేపర్ మిల్లులో పనిచేసే పర్మినెంట్‌ ఉద్యోగులు ఎవరూ విధులకు రావొద్దని యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. ఉన్నట్టుండి పేపర్ మిల్లుకు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది.

గత మూడేళ్లుగా ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం కొత్త అగ్రిమెంట్లు చేయకుండా మోసం చేస్తోందని, యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇంతలో పర్మినెంట్ ఉద్యోగులను కూడా విధులకు రావొద్దంటూ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు దగ్గర నోటీసు కూడా అంటించింది. కార్మికుల సమ్మెకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంఘీభావం తెలిపారు. ఈ రోజు యాజమాన్యంతో చర్చిద్దామని కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు. కొత్త అగ్రిమెంట్లు సహా మిగిలిన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చించనున్నారు.

కార్మికశాఖ అధికారులు కూడా ఇవాళ మిల్లు దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక దినోత్సవం రోజు కార్మికుల్ని అణిచివేసేందుకు పేపర్ మిల్లు పరిశ్రమ లాకౌట్ ప్రకటించడం దారుణమని సీఐటీయూ నేతలు అన్నారు. 1964లో ఆంధ్రా పేపర్ మిల్లును స్థాపించారు. ప్రధానంగా రైటింగ్ పేపర్, ప్రింటింగ్ పేపర్, కాపీయర్ పేపర్లు తయారవుతాయి. ఈ యూనిట్‌ను రూ.3,400 కోట్ల పెట్టుబడితో ఆధునీకరించాలని నిర్ణయించారు. కానీ ఇంతలోనే లాకౌట్ ప్రకటించడం సంచలనంగా మారింది.

ఇటీవల కాకినాడలో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్లాంట్ కూడా మూతపడింది. భారీగా నష్టాలు రావడంతో మూసివేయాలని కంపెనీ బోర్డు మార్చి 31న నిర్ణయం తీసుకుంది. వెంటనే ప్లాంట్‌ను మూసివేశారు. దాదాపు రూ.1406 కోట్లు నష్టాలు పేరుకుపోవడంతో, ప్లాంట్ నిర్వహణ లాభదాయకం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు సమాచారం ఇచ్చారు. అలాగే ప్లాంట్ మూసివేస్తున్నట్లు కలెక్టర్, పరిశ్రమలు, ఇతర శాఖలకు సమాచారం ఇచ్చారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Paper Mill
  • Andhrapradesh
  • Kadiam
  • Lockout
  • rajahmundry

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

  • A shock for Rajamahendravaram Paper Mills...

    Andhra Paper Mills: రాజమహేంద్రవరం పేపర్‌ మిల్స్‌కు షాక్..

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd