HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rajahmundry Andhra Paper Mill Lockout

Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..

  • Author : Vamsi Chowdary Korata Date : 02-05-2026 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Paper Mill Lokout
Andhra Paper Mill Lokout

Andhra Paper Mill Lokout  తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్‌ మిల్లు యూనిట్‌లో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులతో యాజమాన్యం చర్చలు జరపనుంది.

తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. పేపర్ మిల్లులో పనిచేసే పర్మినెంట్‌ ఉద్యోగులు ఎవరూ విధులకు రావొద్దని యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. ఉన్నట్టుండి పేపర్ మిల్లుకు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది.

గత మూడేళ్లుగా ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం కొత్త అగ్రిమెంట్లు చేయకుండా మోసం చేస్తోందని, యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇంతలో పర్మినెంట్ ఉద్యోగులను కూడా విధులకు రావొద్దంటూ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు దగ్గర నోటీసు కూడా అంటించింది. కార్మికుల సమ్మెకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంఘీభావం తెలిపారు. ఈ రోజు యాజమాన్యంతో చర్చిద్దామని కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు. కొత్త అగ్రిమెంట్లు సహా మిగిలిన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చించనున్నారు.

కార్మికశాఖ అధికారులు కూడా ఇవాళ మిల్లు దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక దినోత్సవం రోజు కార్మికుల్ని అణిచివేసేందుకు పేపర్ మిల్లు పరిశ్రమ లాకౌట్ ప్రకటించడం దారుణమని సీఐటీయూ నేతలు అన్నారు. 1964లో ఆంధ్రా పేపర్ మిల్లును స్థాపించారు. ప్రధానంగా రైటింగ్ పేపర్, ప్రింటింగ్ పేపర్, కాపీయర్ పేపర్లు తయారవుతాయి. ఈ యూనిట్‌ను రూ.3,400 కోట్ల పెట్టుబడితో ఆధునీకరించాలని నిర్ణయించారు. కానీ ఇంతలోనే లాకౌట్ ప్రకటించడం సంచలనంగా మారింది.

ఇటీవల కాకినాడలో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్లాంట్ కూడా మూతపడింది. భారీగా నష్టాలు రావడంతో మూసివేయాలని కంపెనీ బోర్డు మార్చి 31న నిర్ణయం తీసుకుంది. వెంటనే ప్లాంట్‌ను మూసివేశారు. దాదాపు రూ.1406 కోట్లు నష్టాలు పేరుకుపోవడంతో, ప్లాంట్ నిర్వహణ లాభదాయకం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు సమాచారం ఇచ్చారు. అలాగే ప్లాంట్ మూసివేస్తున్నట్లు కలెక్టర్, పరిశ్రమలు, ఇతర శాఖలకు సమాచారం ఇచ్చారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Paper Mill
  • Andhrapradesh
  • Kadiam
  • Lockout
  • rajahmundry

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd