Nellore : దంపతుల హత్యకేసులో వీడిన మిస్టరీ…సప్లయిరే హంతకుడని తేల్చిన పోలీసులు..!!
నెల్లూరులో శనివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. శివ, రామకృష్ణ అనే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
- By hashtagu Published Date - 07:12 PM, Wed - 31 August 22
నెల్లూరులో శనివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. శివ, రామకృష్ణ అనే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. శివ, రామకృష్ణ ఇద్దరూ బావ బామ్మర్దులు. ఇద్దరూ కలిసి కృష్ణారావు, సునీతలను హత్య చేశారు. కృష్ణారావు హోటల్ లో శివ సప్లయిర్ గా పనిచేస్తున్నాడు. ఒక రోజు అందరిముందు శివను కృష్ణారావు మందలించాడు. దాంతో యజమానిపై శివ కక్ష పెంచుకున్నాడు. దాంతో శివ తన బావ రామకృష్ణతో కలిసి కృష్ణారావు దంపతులను హత్య చేసినట్లు సమాచారం.
నెల్లూరులోని విద్యుత్ శాఖా కార్యాలయం వద్ద శ్రీరామ క్యాంటీన్ అధినేత వాసిరెడ్డి కృష్ణారావు పడారుపల్లి సమీపంలోని అశోక్నగర్లో నివాసం ఉంటున్నాడు. వారి ఇద్దరు కుమారులు ప్రేమ్ చంద్, సాయిచంద్ లకు పెళ్లిళ్లు కావడంతో వారు వేరుగా ఉంటున్నారు.కృష్ణారావుకు హోటల్ ఉండటంతో అర్ధరాత్రి వరకు అక్కడే ఉండేవాడు. రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్లేవాడు. శనివారం రాత్రి సునీత తన భర్త ఇంటికి వస్తారని తలుపులకు గడి వేయకుండా తన గదిలోకి వెళ్లి నిద్రపోయారు.
అప్పటికే ముందస్తు ప్లాన్ ప్రకారం శివ, రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్ రూమ్ లో నిద్రపోతున్న సునీత తలపై కర్రతో గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది.
అదే సమయంలో ఇంటికి వచ్చిన కృష్ణారావుపై దాడి చేసి అతని గొంతుకోసి హత్యచేశారు. డీఎస్పీ అబ్దుల్ సుబహాన్ పర్యవేక్షణలో వేదాయపాలెం సీఐ నరసింహారావు, ప్రత్యేక పోలీస్ బృందం నిందితులు శివ, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు.
Related News
Fraud : ఆ మహిళలే అతడి టార్గెట్.. నమ్మించి నట్టేట ముంచి.. చివరికి..!
విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్. ఆ మహిళలు... ఒంటరిగా జీవించేవారు. సొంతంగా ఎవరూ లేని వారు. మానసికంగా చాలా బలహీనంగా ఉండి మరో జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వారు.