Ganja : అనంతపురంలో 18మంది గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు
అనంతపురంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన
- By Prasad Published Date - 12:47 PM, Sun - 1 October 23
అనంతపురంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన సరఫరాదారులతో సంబంధమున్న 18 మంది సభ్యుల గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసు సూపరింటెండెంట్ కెకెఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు బట్టబయలు చేసి వారి నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, వారి వద్ద నుంచి 18 సెల్ఫోన్లు, 2 ఆటోరిక్షాలు, 3 మోటారు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రధాన నిందితుడు జాఫర్ కొక్కరపల్లె గ్రామానికి చెందిన అరుణ్తో పాటు విశాఖపట్నం జిల్లా పాడేరు సమీపంలోని చిట్టి, అంకిత్తో సత్ససంబంధాలు పెంచుకున్నాడు. అనంతపురంలోని సోమనాథ్నగర్లో పవన్కుమార్, లోక్నాథ్ నాయుడులు కిలో రూ.6 వేలకు కొనుగోలు చేశారు. అదే విధంగా స్థానికులు జి భరత్ కుమార్, సయ్యద్ ఖాజా హుస్సేన్, సాకే తిమోతి, బోయి వంశీకృష్ణ, గాజుల దిలీప్, చినప్ప రెడ్డి, హెన్సాయిరెడ్డి, రెప్పల హజీజ్లకు కిలో రూ.10,000 చొప్పున నిందితులు విక్రయించారు.
గంజాయిని 101 మంది కస్టమర్లకు విక్రయించారని, వీరిలో ఎక్కువ మంది 17 ఏళ్లలోపు మైనర్లేనని విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్, కర్నూలు మీదుగా అనంతపురం నుంచి రోడ్డు మార్గంలో గంజాయిని సరఫరా అవుతుందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై సమచారం వస్తే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ కోరారు.
Related News
666 Crores Jewels : రూ.666 కోట్ల బంగారు ఆభరణాల కంటెయినర్ బోల్తా.. ఏమైందంటే ?
666 Crores Jewels : రూ.666 కోట్లు విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడింది.