HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Notification For 2260 New Special Education Teacher Posts In Ap

AP Govt : ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు నోటీఫికేషన్‌

ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

  • By Latha Suma Published Date - 05:05 PM, Tue - 15 April 25
  • daily-hunt
Notification for 2,260 new Special Education Teacher posts in AP
Notification for 2,260 new Special Education Teacher posts in AP

AP Govt: ఏపీ ప్రభుత్వం కొత్తగా 2,260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Read Also: Coconut Ritual: గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

కాగా, ఏపీలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ నెలలోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ పలు మార్లు స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్‌పై పెట్టిన విషయం తెలిసిందే. ఇక, మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏపీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కొత్త విద్యా సంవత్సరం (2025-26) ప్రారంభం అయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఇప్పటికే ఏపీ టెట్‌ పరీక్షను నిర్వహించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టెట్‌ ఫలితాల్లో 1,87,256 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్ష (డీఎస్సీ)లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది. ఈ టెట్‌ స్కోర్‌కు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT) 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (SA)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (PET)-132 పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ఇప్పటికే ఏపీ డీఎస్సీ సిలబస్‌ కూడా విడుదల చేసింది. అయితే.. పూర్తి వివరాలను, ముఖ్యమైన తేదీలను నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

Read Also: Supreme Court : చిన్నారుల అక్రమ రవాణా కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap govt
  • Autism
  • Mental disability
  • Special Education Teacher Posts

Related News

Ap Fee Reimbursement

Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్

Fee Reimbursement: గత ప్రభుత్వ కాలంలో సుమారు రూ.4,000 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపి, ఆ బకాయిలలో ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా, కాలేజీలకు చెల్లింపులు సక్రమంగా చేరడం సులభమవుతుంది.

  • Ap Aqua

    Aqua Farmers : ఓ పక్క ట్రంప్..మరోపక్క ద‌ళారుల దోపిడీతో కుదేల్ అవుతున్న ఆక్వా రైతులు

  • Lokesh supports National Education Policy

    Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

  • Og Tgh

    OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?

  • Pawan Uppada

    Pawan’s Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు పవన్ చెక్ !!

Latest News

  • TVK Vijay Rally in Stampede : కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

  • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

  • Invest in Telangana : రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులు- CMO

  • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

  • ‎Friday: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!

Trending News

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd