HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mobile Ration Vans Cancelled In Ap

Mobile Ration Vans: ఏపీలో రేష‌న్ పొందేవారికి బిగ్ అల‌ర్ట్‌.. జూన్ 1 నుంచి షాపుల‌కు పోవాల్సిందే!

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

  • Author : Gopichand Date : 20-05-2025 - 6:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mobile Ration Vans
Mobile Ration Vans

Mobile Ration Vans: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్ల (Mobile Ration Vans)ను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై రేషన్ కార్డుదారులు తమ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను స్థానిక రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం రేషన్ పంపిణీలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడం.. అలాగే అవినీతి, అక్రమ రవాణాను అరికట్టడం లక్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

మొబైల్ రేషన్ వ్యాన్లు 2021లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో “డోర్ డెలివరీ” పథకంలో భాగంగా ప్రవేశపెట్టారు. దీని ద్వారా రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చాలని లక్ష్యంగా గ‌త ప్ర‌భుత్వం ఈ వ్యాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ వ్యాన్లు “డోర్ డెలివరీ” కంటే “స్ట్రీట్ రేషన్ వ్యాన్లు”గా మారాయని, లబ్ధిదారులకు గణనీయమైన ప్రయోజనం చేకూర్చలేదని ఆయన పేర్కొన్నారు.

మంత్రి మాట్లాడుతూ.. వ్యాన్ల షెడ్యూల్ గురించి ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల లబ్ధిదారులు, ముఖ్యంగా రోజువారీ కూలీలు ఇంట్లో ఉండి రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని తెలిపారు. తెనాలిలో ఒక మహిళ తన రేషన్ సరుకులను తీసుకోలేకపోయిన సమస్యను లేవనెత్తగా మంత్రి ఈ విషయంపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదనంగా ఈ వ్యాన్ల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ జరుగుతోందని, ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని కలిగించిందని ఆయన ఆరోపించారు.

రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ

జూన్ 1, 2025 నుంచి రేషన్ సరుకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా మాత్రమే పంపిణీ చేయబడతాయి. ఈ నిర్ణయం రేషన్ పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా చేయడంతో పాటు, గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి ఛాన్స్ ఉంటుంద‌ని కూట‌మి స‌ర్కార్ భావ‌న‌. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు తీసుకోవడం వల్ల లబ్ధిదారులు నిర్ణీత సమయాల్లో సౌకర్యవంతంగా రేషన్ సేకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Coca-Cola India : ‘మైదాన్ సాఫ్’ ప్రచారంపై డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్న డిస్కవరీ ఛానల్

రేషన్ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఈ కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఉంటాయి. ఏటీఎం కార్డుల రూపంలో ఉంటాయి. ఇవి భద్రతా ఫీచర్లతో సహా కుటుంబ సభ్యుల వివరాలను కలిగి ఉంటాయి. మే 2025 నుంచి ఈ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ-కేవైసీ ప్రక్రియ ఏప్రిల్ 30, 2025 నాటికి పూర్తయింది. ఈ కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ సరుకులను తీసుకునే సౌలభ్యం ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • CM Chandrababu
  • Minister Nadendla Manohar
  • Mobile Ration Vans
  • nda govt
  • Ration News

Related News

Sanatana Dharma

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం నెలకొల్పాలని తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ఇందుకు గాను అక్కడి ముఖ్యమంత్రి తో , సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించాలని

  • Satya Kumar Dares Jagan

    జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

    సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Latest News

  • అసిడిటీకి యాంటాసిడ్స్‌నే పరిష్కారమా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!

  • గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు

  • టెస్లా మస్క్ పారితోషికంపై కోర్టు కీలక తీర్పు: 2018 ఒప్పందానికి మళ్లీ చట్టబద్ధత

  • తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష

  • ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి లాభమా?.. నష్టమా?!

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd